Liz Truss: నాడు తనకు తాను ఓటు వేసుకోని బాలిక.. ఇప్పుడు ప్రధాని రేసులో..!
బ్రిటన్లో దాదాపు 40 ఏళ్ల క్రితం ఓ పాఠశాలలో నిర్వహించిన నాటకంలో ఓ బాలిక మార్గరేట్ థాచెర్ పాత్ర పోషించింది. ఆ నాటికలో ఉత్తుత్తి ఎన్నికలు నిర్వహించారు.
ఆసక్తికరంగా లిజ్ ట్రస్ ప్రస్థానం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
బ్రిటన్లో దాదాపు 40 ఏళ్ల క్రితం ఓ పాఠశాలలో నిర్వహించిన నాటకంలో ఓ బాలిక మార్గరేట్ థాచర్ పాత్ర పోషించింది. ఆ నాటికలో ఉత్తుత్తి ఎన్నికలు నిర్వహించారు. దానికి ముందు అభ్యర్థులు ప్రసంగించాలి. ఆ బాలిక కూడా అలానే చేసింది.. కానీ, ఒక్క ఓటు కూడా ఆ బాలికకు రాలేదు. చివరికి తన ఓటు కూడా తనకు వేసుకోలేదు. దాదాపు 39 ఏళ్ల తర్వాత ఆ బాలిక ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రేసులో హాట్ ఫేవరెట్గా నిలిచింది. ఆమే లిజ్ ట్రస్..!
బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగుతారని తేలగానే.. ఆయన వారసుడిగా తొలుత వినిపించిన పేరు రిషి సునాక్..! కానీ, ప్రధాని పదవి కోసం కన్జర్వేటీవ్ పార్టీలో పోటీ ముదిరే కొద్దీ సునాక్ మెల్లగా వెనకబడుతూ వస్తున్నారు. తాజాగా రేసులో అందరికంటే ముందు నిలిచిన లిజ్ ట్రస్ ఇప్పుడు ప్రధాని పదవికి దగ్గరవుతున్నారు. పోటీ ముగింపు దశకు చేరేకొద్దీ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా మారుతున్నాయి.
ఎవరీ లిజ్ ట్రస్..!
1975లో ఆక్స్ఫర్డ్లో వామపక్ష భావజాలం ఉన్న కుటుంబంలో లిజ్ ట్రస్ జన్మించారు. ఆమె తండ్రి లెక్కల ప్రొఫెసర్ కాగా.. తల్లి నర్స్. వారి కుటుంబం తర్వాత గ్లాస్గోకు వలసవెళ్లింది. ఆమె చిన్నప్పుడు తల్లితో కలిసి అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంది. అప్పట్లో అమెరికా అణ్వాయుధాలను రాయల్ ఎయిర్ఫోర్స్ బేస్లో ఉంచాలని నిర్ణయించారు. ఆ తర్వాత రౌండేలో స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసి.. ఆక్స్ఫర్డ్లో చేరారు. అక్కడ ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ను ఎంపిక చేసుకొన్నారు.
విద్యార్థి రాజకీయాల్లో లిబరల్ డెమోక్రాట్ల తరపున చురుగ్గా పాల్గొన్నారు. 1994లో ఆమె పార్టీలో ప్రసంగిస్తూ రాజరికాన్ని అంతమొందించాలన్నారు. లిబరల్ డెమోక్రాట్లు అందరికీ అవకాశాలు ఇవ్వడాన్ని విశ్వసిస్తారని పేర్కొన్నారు. పాలించడం కోసమే కొందరు పుడతారనే దానిని విశ్వసించబోమని చెప్పారు. ఆ తర్వాత కొన్నేళ్లకే ఆమె కన్జర్వేటీవ్ పార్టీకి మారారు. డిగ్రీ తర్వాత ఆమె అకౌంటెంట్గా పనిచేశారు. ఆ సమయంలో ఆమె హ్యూ ఓ లియారీని పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఇద్దరు సంతానం.
ఓటములతో రాజకీయ ప్రస్థానం ప్రారంభం..
2001లో ఎన్నికల్లో కన్జర్వేటీవ్ పార్టీ తరపున ట్రస్ హెమ్స్వర్త్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి 2005 ఎన్నికల్లో కాల్డర్ వ్యాలీలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తొలిసారి ఆగ్నేయ లండన్లోని గ్రీన్ విచ్ నుంచి కౌన్సిలర్గా విజయం సాధించారు. 2008లో రైట్ ఆఫ్ సెంటర్ రిఫార్మ్ థింక్ట్యాంక్లో డిప్యూటీ డైరెక్టర్గా చేరారు. కన్జర్వేటీవ్ పార్టీ నేత డేవిడ్ కేమరూన్ 2010లో జరిగిన ఎన్నికలకు ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె నార్ఫోక్ నుంచి పోటీ చేయడానికి ఎంపికయ్యారు. అక్కడ 13,000 వేల ఓట్లతో గెలిచారు.
విద్యాశాఖ మంత్రిగా..
2012లో ఆమె వ్యక్తిగత జీవితంపై విమర్శలు రావడంతో పదవి నుంచి తప్పించాలనే యత్నం జరిగినా .. అది ఫలించలేదు. అదే ఏడాది ఆమె విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఈ క్రమంలో పాఠశాల సంస్కరణలపై డిప్యూటీ ప్రైమినిస్టర్ నిక్తో ఆమె గొడవపడ్డారు. 2014 నాటికి ఆమెను ప్రధాని కేమరూన్ తన కేబినేట్లోకి తీసుకొని.. పర్యావరణ శాఖ సెక్రటరీగా నియమించారు. 2015లో కన్జర్వేటీవ్ సదస్సులో ఆమె ‘‘మనం మూడింట రెండువంతులు ఛీజ్ దిగుమతి చేసుకొంటున్నాం’’ అంటూ చేసిన ప్రసంగం బ్రిటన్ దృష్టిని ఆకర్షించింది.
బ్రెగ్జిట్ వ్యతిరేకి..
బ్రిటన్ చరిత్రలో జరిగిన అత్యంత కీలకమైన బ్రెగ్జిట్ను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఐరోపా సమాఖ్యలో కొనసాగడానికే ఆమె మొగ్గు చూపారు. ఈయూ నుంచి విడిపోవడాన్ని పెద్ద విషాదంగా పేర్కొంటూ సన్ పత్రికకు ఎడిటోరియల్ రాశారు. బ్రెగ్జిట్ వల్ల వ్యాపారాల్లో మరింత జాప్యం చోటు చేసుకొంటుందని అభిప్రాయపడ్డారు. కానీ, బ్రెగ్జిట్కు బ్రిటన్లో ఆమోద ముద్రపడటంతో మనసు మార్చుకొన్నారు. బ్రెగ్జిట్తో బ్రిటన్లో పనితీరును మార్చుకోవచ్చని వాదించారు. 2016లో ఆమె థెరిస్సా ప్రభుత్వంలో జస్టిస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.
బోరిస్ హయాంలో కీలక పదవులు..
2019లో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రటరీగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. మరో రెండేళ్లకే బ్రిటన్ విదేశాంగశాఖ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్లోని అత్యంత సీనియర్ పదవుల్లో ఇది కూడా ఒకటి. అదే సమయంలో ఉక్రెయిన్పై రష్యా దాడి చేపట్టింది. లిజ్ ట్రస్ మాస్కోకు వ్యతిరేకంగా బ్రిటన్ తరపున గళం వినిపించారు. కానీ, ఇది ఐరోపాలో తీవ్ర సంక్షోభం కావడంతో ఆమె పాత్రను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎక్కువగా పోషించాల్సి వచ్చింది. ఫలితంగా ట్రస్కు అనుకొన్నంత పేరు రాలేదనే చెప్పాలి. కానీ, బోరిస్ ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో మరోసారి లిజ్ ట్రస్ పేరు తెరపైకి వచ్చింది. రిషి పై జాన్సన్ గుర్రుగా ఉండటంతో.. ట్రస్కు తెరవెనుక మద్దతునిస్తున్నారు. ఫలితంగా ఆమె రేసులో ముందుకొచ్చారు.
మార్గరేట్ థాచర్ను అనుకరిస్తూ..
దాదాపు 1,60,000 మంది సభ్యులున్న కన్జర్వేటీవ్ పార్టీలో మద్దతు కోసం ఆమె శతవిధాలా యత్నిస్తున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్ వలే కనిపించేలా వస్త్రధారణ ఉండేట్లు జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల ఫిబ్రవరిలో రష్యా పర్యటన సమయంలో.. రిషితో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈ శైలిని బ్రిటన్ మీడియా గుర్తించింది. లిజ్ ట్రస్ తన ప్రచారంలో ప్రజలకు తాయిలాలను ఇవ్వడాన్నే నమ్ముకొన్నారు. మొత్తం 30 బిలియన్ పౌండ్ల పన్ను రాయితీలను ఇస్తామనే హామీని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలను ప్రజలు తట్టుకొనేలా చేయడం కోసమే ఇదంతా అని ఆమె పేర్కొన్నారు. ఆమె ఆర్థిక ప్రతిపాదనలకు ట్రస్సోనమిక్స్గా పేరుపెట్టారు. 1980ల్లో మార్గరేట్ థాచర్ కూడా వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గిస్తామని జనాకర్షక నిర్ణయం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా