Covid-19: వైరస్ వ్యాప్తికి ఇదీ ఓ కారణం.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!
కొవిడ్-19 మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సమాచారం చక్కర్లు కొడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది....
జెనీవా: కొవిడ్-19 మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సమాచారం చక్కర్లు కొడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర కారణాలతో పాటు ఇది కూడా వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తోందని హెచ్చరించింది.
‘మహమ్మారి కథ ముగిసింది, ఒమిక్రాన్ తీవ్రత పెద్దగా ఏమీ లేదు, ఇక ఇదే చివరి వేరియంట్’ అంటూ వస్తున్న సమచారమంతా తప్పని డబ్ల్యూహెచ్ఓలో కొవిడ్-19 సంబంధిత వ్యవహారాలు చూస్తున్న సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్ ఖెర్కోవ్ స్పష్టం చేశారు. ఈ తప్పుడు వార్తలే మహమ్మారి ఇంకా వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయని హెచ్చరించారు. ఇలాంటి నిరాధార వార్తల వల్ల ప్రజల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు.
కొవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడానికి వ్యాక్సిన్లు ఒక్కటే మార్గమని ఖెర్కోవ్ ఉద్ఘాటించారు. వ్యాధి తీవ్రత, మరణాల సంఖ్యను తగ్గించడంలో టీకాలు బాగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ను సైతం టీకాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయన్నారు. ఇప్పటి వరకు వెలుగుచూసిన వాటిలో బీఏ.2 వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందన్నారు. కేసులు భారీగా పెరిగితే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య సైతం పెరుగుతుందన్నారు. ఫలితంగా మరణాలూ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో మహమ్మారిపై వస్తోన్న తప్పుడు సమాచారం నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కొవిడ్ మహమ్మారి కథ ముగియడం అనే అంశం ఇంకా చాలా దూరంలో ఉందని ఇటీవల డబ్ల్యూహెచ్ఓ తెలిపిన విషయం తెలిసిందే. ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్న నేపథ్యంలో సంస్థ ఈ హెచ్చరిక చేసింది.
ఆగ్నేయాసియాతో పాటు కొన్ని ఐరోపా దేశాల్లో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం రాష్ట్రాలను శుక్రవారం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఏమాత్రం నిర్లక్ష్యం తగదని స్పష్టం చేసింది. ఈమేరకు కొత్త వేరియంట్లపై నిఘా ఉంచడానికి పెద్దఎత్తున జన్యుక్రమ విశ్లేషణ చేపట్టాలని సూచిస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితులపై సునిశిత దృష్టి సారించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!