mpox: మంకీపాక్స్ పేరు ఇకపై ఎమ్పాక్స్!
మంకీపాక్స్ పేరును ఎమ్పాక్స్గా మారుస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. పలు దేశాల నుంచి విజ్ఞప్తులు రావడంతోపాటు నిపుణుల సూచన మేరకు పేరును మార్చినట్లు తెలుస్తోంది.
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలు పోరాడుతోన్న సమయంలోనే.. మంకీపాక్స్ (Monkeypox) వైరస్ కూడా పలు దేశాలను వెంటాడింది. ఇప్పటివరకు 100కుపైగా దేశాలకు వ్యాపించడంతోపాటు 80వేల మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ దీనిని మంకీపాక్స్ అని పిలవడంపై నిపుణుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా ఒక ప్రాంతంపై వివక్షత చూపించేలా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో మంకీపాక్స్ పేరును ఎమ్పాక్స్ (mpox)గా మార్చుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. వచ్చే ఏడాది వరకు రెండు పేర్లతో పిలవవచ్చని.. పాత పేరు దశల వారీగా తొలగించనున్నట్లు వెల్లడించింది.
మంకీపాక్స్ వైరస్ను 1958లో తొలుత కోతుల్లో గుర్తించిన రెండు దశాబ్దాల తర్వాత (1970లో) కాంగోకు చెందిన ఓ బాలుడిలో కనుగొన్నారు. మానవుల్లో గుర్తించిన తొలి మంకీపాక్స్ కేసు కూడా అదే. అప్పటినుంచి పలు ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ ప్రాబల్యం అధికంగా కొనసాగింది. కానీ, ఈ ఏడాది విస్తృతంగా వ్యాపించి దాదాపు 100పైగా దేశాలకు విస్తరించింది. యూరప్, అమెరికాల్లోనే కేసులు అధికంగా నమోదయ్యాయి. అయినప్పటికీ దీన్ని ఆఫ్రికాకు చెందినట్లుగా పిలవడాన్ని శాస్త్రవేత్తలు తప్పుపట్టారు. యూరప్లో కేసులు విస్తృతంగా బయటపడుతున్నప్పటికీ గతంలో ఆఫ్రికన్ బాధితుల ఫొటోలను మాత్రమే విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆఫ్రికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసింది. ఈ వైరస్ ఒక ప్రాంతానికి చెందినదిగా పేర్కొనడం సమంజసం కాదని.. వివక్షత లేని పేరును సూచించాలని అందులో పేర్కొంది. వాటిని పరిగణనలోకి తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ.. దీని పేరు మార్పుపై తాజాగా ప్రకటన చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా