
WHO: ఒక్క భారత్లోనే 47 లక్షల కొవిడ్ మరణాలు.. డబ్ల్యూహెచ్ఓ నివేదికను తప్పుబట్టిన భారత్
లండన్: ప్రపంచవ్యాప్తంగా గత రెండేళ్లుగా కరోనా వైరస్ సృష్టిస్తోన్న విలయంతో దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ సమయంలో కొవిడ్ కారణంగా నేరుగా లేదా ఆరోగ్య వ్యవస్థపై అది చూపిన ప్రభావం వల్ల గడిచిన రెండేళ్లలో కోటీ 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. అధికారికంగా ఇప్పటివరకు చెబుతున్న 62 లక్షల మరణాల కంటే రెండురెట్లు ఎక్కువ ఉండవచ్చని అంచనా వేసింది. వీటిలో ఎక్కువ మరణాలు ఆగ్నేయాసియా, యూరప్, ఆమెరికా దేశాల్లోనే సంభవించినట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా కేవలం ఒక్క భారత్లోనే 47 లక్షల కొవిడ్ సంబంధిత మరణాలు చోటుచేసుకున్నట్లు పేర్కొనగా.. డబ్ల్యూహెచ్ఓ నివేదికను భారత ప్రభుత్వం తప్పుబట్టింది.
కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాల్లో కొవిడ్ మరణాల సంఖ్య వాస్తవానికంటే ఎక్కవుగా ఉన్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 2020, డిసెంబర్ 2021 మధ్యకాలంలో కొవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు వేసింది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా కోటి 50లక్షల మంది మరణించగా కేవలం ఒక్క భారత్లోనే 47లక్షల మరణాలు సంభవించవచ్చని లెక్కగట్టింది. అయితే, వీటిలో నేరుగా కొవిడ్తో ఎంతమంది మరణించారు, ఆరోగ్య వ్యవస్థపై చూపిన ప్రభావంతో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే గణాంకాలను వెల్లడించలేదు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలపైనా స్పష్టత కరవైంది.
వ్యతిరేకించిన భారత్..
భారత్లో కొవిడ్ కారణంగా 47 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడించడాన్ని భారత్ తప్పుబట్టింది. వీటికి సంబంధించిన ప్రామాణిక సమాచారంతో పాటు అదనపు మరణాలను అంచనా వేయడానికి అనుసరించిన గణిత నమూనాను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. డేటా సేకరణతోపాటు గణాంక పద్ధతి చెల్లుబాటును ప్రశ్నించింది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలకు చెందిన సమాచారాన్ని ఆయా వెబ్సైట్ల నుంచి పొందడంతోపాటు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. వీటికి సంబంధించి ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా డబ్ల్యూహెచ్ఓ నివేదిక విడుదల చేయడాన్ని తప్పుబడుతూ కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
-
General News
cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
-
World News
Pakistan: పాక్లో తీవ్ర పేపర్ కొరత.. విద్యార్థుల పుస్తకాలు ముద్రించలేమని ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Social Look: నయన్- విఘ్నేశ్ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్ కల్యాణ్
- Droupadi Murmu: గృహహింసను దాటుకొని, అత్యున్నత పదవికి పోటీలో నిలిచి..!