WHO: కొవిడ్ మూలాల గురించి మీకు తెలిసింది చెప్పండి..!
కరోనా(Coronavirus) మూలం ఇప్పటికీ మిస్టరీనే. వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో నివేదికలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై WHO స్పందించింది.
జెనీవా: కరోనా (Coronavirus).. ఈ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. అడపాదడపా కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి అదుపులోనే ఉంది. అయితే ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి, ఇన్ని దేశాలకు పాకిందనే దానిపై కచ్చితమైన సమాచారం మాత్రం ఇంతవరకు లభించలేదు. ఈ వైరస్ చైనా ల్యాబ్ నుంచే లీక్ అయిందని తొలి నుంచీ అనుమానాలు వ్యక్తమవ్వగా.. దానిపై అమెరికా ఇటీవల మరో నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. కొవిడ్ -19 మూలాల గురించి తెలిసిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని డబ్ల్యూహెచ్వో (WHO) అన్ని దేశాలను కోరింది.
‘కరోనా (Coronavirus) మూలాల గురించి ఏ దేశం వద్ద అయినా సమాచారం ఉంటే.. దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ సైన్స్ సంస్థలకు వెల్లడించాలి. ఇది అత్యావశ్యకం. దీనిని సేకరించేది ఏ ఒక్కరినో నిందించడానికి కాదు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ముందస్తుగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగానే ఈ సమాచారాన్ని కోరుతున్నాం. కరోనా మూలాన్ని గుర్తించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ WHO వదిలేయదు’ అని ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ (Tedros Adhanom Ghebreyesus) అన్నారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా (Covid 19) వైరస్ జన్మస్థానం చైనా (china)లో ఓ ల్యాబ్ నుంచే జరిగిందని అమెరికా (USA)కు చెందిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ కొత్తగా సేకరించిన నిఘా సమాచారం మేరకు ల్యాబ్ లీక్పై ఓ నిర్ణయానికి వచ్చింది. ది ఎనర్జీ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయి నిపుణులు ఉండటంతో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకొంది. అమెరికాలో జాతీయ పరిశోధనశాలలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంటుంది. వీటిల్లో కొన్ని అత్యున్నత స్థాయి జీవ పరిశోధనలు చేస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ నివేదికను చైనా తీవ్రంగా ఖండించింది. ఇదొక దుష్ప్రచారం అని కొట్టిపారేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్