China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
దక్షిణ చైనా సముద్రంలో నాలుగు రోజులపాటు లైవ్ఫైర్ డ్రిల్స్ పేరిట డ్రాగన్ చేసిన హడావుడి బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే తైవాన్ ఆర్థిక వ్యస్థను ఉక్కిబిక్కిరి చేసేలా యుద్ధ విన్యాసాలను చేసినట్లు డ్రాగన్ సంబరపడుతోంది. భవిష్యత్తులో తరచూ నిర్వహిస్తామని కూడా చెబుతోంది.
సొంత ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
దక్షిణ చైనా సముద్రంలో నాలుగు రోజులపాటు లైవ్ ఫైర్ డ్రిల్స్ పేరిట డ్రాగన్ చేసిన హడావుడి బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే తైవాన్ ఆర్థిక వ్యవస్థను ఉక్కిబిక్కిరి చేసేలా యుద్ధ విన్యాసాలను చేసినట్లు డ్రాగన్ సంబరపడుతోంది. భవిష్యత్తులో తరచూ నిర్వహిస్తామని కూడా చెబుతోంది. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ రియల్ ఎస్టేట్ సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా తైవాన్ జల సంధి సంక్షోభం కూడా తోడైతే.. అది చైనా ఆర్థిక వ్యవస్థపై భస్మాసుర హస్తం వలే పరిణమించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.
ప్రమాదకరంగా షిప్పింగ్..
తైవాన్ వద్ద డ్రాగన్ లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది. అంటే యుద్ధంలో వాడే నిజమైన ఆయుధాలతో యుద్ధవిన్యాసాలు చేయడమన్నమాట. అంటే ఆ మార్గంలో ప్రయాణించడం నౌకలకు మృత్యువుతో సమానం. ఈ క్రమంలో ఉత్తర ఆసియా నుంచి వచ్చే డజన్ల కొద్దీ నౌకలు గత కొన్ని రోజులుగా మార్గం మార్చుకోవడం గానీ, ప్రయాణాన్ని ఆలస్యం చేయడం గానీ చేస్తున్నాయి. తైవాన్, ఆ ద్వీపం తూర్పు మార్గంలో సాధారణంగా నిత్యం 240 నౌకలు వెళతాయి. ఈ క్రమంలో అవి మార్గం ముందు ప్రమాదం లేదని నిర్ధారించుకొన్న తర్వాతే.. కదలాల్సిన పరిస్థితి.
తైవాన్ను అడ్డుకోగానే సంబరం కాదు..
చైనా శక్తి ప్రదర్శన నిర్వహించి.. తైవాన్ వాయు, సముద్ర మార్గాలను ఎంత తేలిగ్గా చుట్టుముట్టగలదో ప్రపంచానికి చూపించింది. కానీ, అదే సమయంలో ఆ చర్యలు చైనా ఆర్థిక వ్యవస్థపై అంతే పెనుభారంగా మారతాయనే విషయాన్ని మర్చిపోయింది. వాస్తవానికి చైనా బ్లాకేడ్ను తైవాన్ జలసంధిలో అమెరికా నౌకలు సవాలు చేస్తే ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది. ఆ మార్గంలో వ్యాపారాలు నిర్వహించే సంస్థలు, కంపెనీలకు ఫైనాన్స్ లభించడం నిలిచిపోతుంది. షిప్పింగ్కు అవసరమైన బీమా ధరలు పెరగడం గానీ, అసలు లభించకపోవడంగానీ చోటు చేసుకొంటుంది. తైవాన్ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో నెలకొనే ఉద్రిక్తతలు చైనా ఆర్థిక వ్యవస్థపై దారుణమైన ప్రభావం చూపిస్తాయి. చైనా ప్రధాన నౌకాశ్రయాలైన షాంఘై, డాలియన్, తియాన్జిన్లు.. ప్రధానంగా తైవాన్ సమీప జలాల్లో నుంచి జరిగే వ్యాపారంపై ఆధారపడ్డాయి. దక్షిణ కొరియా, జపాన్, చైనాలు తైవాన్ జలసంధిపై ఆధారపడ్డాయి. దక్షిణ చైనా సముద్రం నుంచి అమెరికాకు వెళ్లడానికి ఇది ప్రధాన మార్గంగా ఉంది. ఆస్ట్రేలియా నుంచి ఉత్తరచైనాలోని ప్రధాన రేవులకు వెళ్లే ముడి ఇనుము తైవాన్ జలాలను దాటాల్సిందే.
ప్రత్యామ్నాయ మార్గంలో తుపాన్ల ముప్పు..
బ్లూమ్బెర్గ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో ప్రపంచంలోని కంటైనర్ షిప్పుల్లో సగానికి పైగా తైవాన్ జలసంధిని దాటాయి. ఇక ఈ మార్గంలో నిత్యం మిలియన్ డాలర్ల చమురును ట్యాంకర్లు తరలిస్తున్నాయి. 130 కిలోమీటర్ల వెడల్పైన తైవాన్ జలసంధికి ప్రత్యామ్నాయంగా తూర్పు తైవాన్ వైపు నుంచి లూజోన్ జలసంధి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో తరచూ తుపాన్లు వస్తుండటం నౌకలకు ఇబ్బందికరంగా మారుతుంది.
తైవాన్ వాయు మార్గాల మూసివేత ప్రభావం..
తైవాన్ ప్రపంచ వ్యాప్తంగా సెమీకండెక్టర్లలో 60శాతానికి పైగా తయారు చేస్తుంది. ఈ దేశానికి చెందిన అత్యధిక ఉత్పత్తులను విమానాల ద్వారానే రవాణా చేస్తారు. చైనా తయారు చేసే చాలా ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా ఇక్కడి నుంచే చిప్స్ వెళ్లాలి. తాజా సంక్షోభంతో వాటికి కూడా ఆటంకాలు తలెత్తాయి. మరోవైపు తైవాన్ వద్ద సంక్షోభ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అమెరికా సెనెట్ ఈ వారం సెమీకండెక్టర్ల తయారీకి 280 బిలియన్ డాలర్ల మద్దతును అనుమతించింది. తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ కూడా అమెరికాలోని అరిజోనాలో 12 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.
అది చైనా వల్లకాదు..
తైవాన్లోని ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండెక్టర్ పరిశ్రమ టీఎస్ఎంసీను చైనా ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేదని ఆ సంస్థ ఛైర్మన్ మార్క్ ల్యూ గత వారం తెలిపారు. చైనా దళాలు టీఎస్ఎంసీని బలవంతంగా ఆక్రమించుకొన్నా దానిని నిర్వహించలేరన్నారు. ఈ ఫ్యాక్టరీ బాహ్యప్రపంచంలోని ఐరోపా, జపాన్, అమెరికా వంటి దేశాలపై పూర్తిగా ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో చిప్స్ తయారీలో అవరోధాలు తలెత్తితే ప్రపంచంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. హాంకాంగ్కు చెందిన హిన్రిచ్ ఫౌండేషన్ ప్రకారం క్రూడ్, రిఫైన్డ్ ఆయిల్, ఆటో మొబైల్స్ తర్వాత అత్యధికంగా ట్రేడ్ అయ్యేవి సెమీకండెక్టర్లే. ఈ నేపథ్యంలో తైవాన్ జలసంధిలో తలెత్తే సంక్షోభ ప్రభావం రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్