Monkeypox: కేరళలో మంకీపాక్స్ బాధితుడి మృతి.. భారత్లో తొలి మరణం..?
యూఏఈ (UAE) నుంచి భారత్ వచ్చిన యువకుడు (22) శనివారం మృతి చెందగా.. అతనికి పది రోజుల క్రితమే అక్కడ మంకీపాక్స్గా నిర్ధారణ అయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
యూఏఈలోనే పాజిటివ్గా నిర్ధారణ.. కేరళ అధికారులకు ఆలస్యంగా తెలిసిన వైనం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మంకీపాక్స్ (Monkeypox) అనుమానిత కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కేరళలో మంకీపాక్స్ మరణం కలకలం రేపుతోంది. ఇటీవల యూఏఈ (UAE) నుంచి వచ్చిన యువకుడు (22) శనివారం మృతి చెందగా.. అతనికి పది రోజుల క్రితమే అక్కడ మంకీపాక్స్గా నిర్ధారణ అయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో అతడి నమూనాలను మరోసారి పరీక్షకు పంపించిన కేరళ ఆరోగ్యశాఖ అధికారులు.. అతడి మృతికిగల కారణాలను విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. దీన్ని దేశంలో తొలి మంకీపాక్స్ మరణంగా భావిస్తున్నారు.
కేరళలోని త్రిసూర్కి చెందిన ఓ యువకుడు (22).. జులై 21న యూఏఈ నుంచి భారత్కు చేరుకున్నాడు. అనంతరం జ్వరం, తలనొప్పితో ఎక్కువ కావడంతో జులై 27న ఆస్పత్రిలో చేరాడు. అతని శరీరంపై మంకీపాక్స్ లక్షణాలు లేకపోవడంతో ఆ దిశగా చికిత్స అందించలేదు. అయితే, శనివారం ఆ యువకుడు మృతి చెందాడు. అనంతరం అతడికి యూఏఈలో జులై 19నే మంకీపాక్స్ సోకిన విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు అధికారులకు వెల్లడించారు. యూఏఈ నుంచి భారత్కు బయలుదేరే ముందు వచ్చిన మంకీపాక్స్ పరీక్ష ఫలితాన్ని వైద్యులకు అందించారు. దానిని మరోసారి నిర్ధారించుకునేందుకు కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మృతుడి నమూనాలను స్థానిక వైరాలజీ ల్యాబ్కు పంపించారు.
టెస్టు ఫలితాన్ని చెప్పని యూఏఈ అధికారులు..?
యువకుడి మృతదేహాన్ని మంకీపాక్స్ ప్రొటోకాల్కు అనుగుణంగానే ఖననం చేసిన అధికారులు.. అతడి ప్రైమరీ కాంటాక్టులను పర్యవేక్షణలో ఉంచారు. ఇదే విషయంపై మాట్లాడిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్.. యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలేవీ కనిపించలేదన్నారు. ‘ఇది కొవిడ్ మాదిరి ప్రాణాంతకమైన వైరస్ కాదు. కానీ, ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మరణాల రేటు తక్కువే. అయినప్పటికీ ఆ యువకుడు మృతి చెందడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం’ అని వెల్లడించారు. దీంతోపాటు అతడికి మంకీపాక్స్ పాజిటివ్ వచ్చిన విషయాన్ని యూఏఈ అధికారులు తెలియజేయకపోవడంపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతామని వీణా జార్జ్ అన్నారు.
ఇదిలాఉంటే, భారత్లో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదుకాగా అందులో మూడు కేరళలోనే ఉన్నాయి. మరోవైపు దేశంలో మంకీపాక్స్ బారినపడిన తొలి వ్యక్తి (32) పూర్తిగా కోలుకున్నట్లు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతోన్న అతడికి.. జులై 14న మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ కాగా తాజాగా అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఆఫ్రికాలో ఇప్పటికే మూడు మరణాలు చోటుచేసుకోగా.. తాజాగా భారత్లో మంకీపాక్స్ తొలి మరణం సంభవించింది. స్పెయిన్లో రెండు, బ్రెజిల్లో ఒక మంకీపాక్స్ మరణం నమోదైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం