Russia: రష్యా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది..?
సైనిక సమీకరణతో భయాందోళనలకు గురవుతోన్న రష్యన్లు పొరుగు దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధాన్ని (Ukraine Crisis) మరింత తీవ్రతరం చేసేందుకు ప్రయత్నిస్తోన్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. సైనిక సమీకరణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సైన్యంలో చేరాలంటూ పౌరులకు ఆదేశాలు వెళ్తున్నాయి. దీంతో భయాందోళనలకు గురవుతోన్న రష్యన్లు సమీప దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పొరుగు దేశాలైన జార్జియా, ఫిన్లాండ్తోపాటు వీసా అవసరం లేని ఆర్మేనియా, టర్కీ, అజర్బైజాన్ దేశాలకు క్యూ కడుతున్నారు. సరిహద్దుల్లో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోన్న పుతిన్ ప్రభుత్వం.. ఏ క్షణమైనా సరిహద్దులను మూసివేసే ప్రకటన వెలువడవచ్చనే ఆందోళన రష్యన్లను వెంటాడుతోంది.
దేశం వీడుతోన్న లక్షల మంది రష్యన్లు..!
ఉక్రెయిన్పై దాడులను పెంచేందుకు గాను దాదాపు 3లక్షల సైన్యాన్ని సమీకరించాలని వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలే ప్రకటించారు. అయితే, అధికారికంగా మూడు లక్షలని చెబుతున్నప్పటికీ సుమారు పది లక్షల మందిని క్రెమ్లిన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. వీరిని ప్రధాన నగరాలైన మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి కాకుండా ఇతర నగరాల నుంచి సమీకరిస్తారనే వదంతులు మొదలయ్యాయి. దీంతో పొరుగు దేశాలకు తరలివెళ్లేందుకు రష్యన్లు క్యూ కడుతున్నారు. గత కొన్ని రోజులుగా జార్జియా, ఫిన్లాండ్ సరిహద్దుల్లో కార్లు, బస్సులు బారులు తీరుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇప్పటివరకు ఎంత మంది రష్యాను వీడారనే అంశంపై స్పష్టత లేనప్పటికీ కేవలం జార్జియా సరిహద్దు నుంచే సుమారు లక్ష మంది దేశం విడిచినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
సరిహద్దులు మూసివేస్తారా..?
సైనిక సమీకరణ మొదలైనప్పటి నుంచి రష్యన్లు విదేశాలకు బారులు తీరడంపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. ఈ వలసలను నివారించేందుకు సరిహద్దులను మూసివేసే అవకాశం ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. ఈ విషయానికి సంబంధించి తనకు ఏమీ తెలియదన్నారు. సరిహద్దులు మూసివేయడంపై ప్రస్తుతానికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
జెట్ విమానాల్లో ఒక్కో సీటుకు రూ.20లక్షల ఛార్జి
త్వరలోనే దేశ సరిహద్దులు మూసివేస్తారని వార్తలు ఎక్కువైన నేపథ్యంలో సొంత వాహనాలను కాకుండా రష్యన్ పౌరులు విమానాలను ఆశ్రయిస్తున్నారు. అయితే, 18 నుంచి 65 ఏళ్ల వయసువారిని విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ ప్రభుత్వం నుంచి విమానయాన సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో చేసేదేమీ లేక రష్యన్లు ప్రైవేటు విమానాలను ఆశ్రయిస్తున్నారు. రష్యన్లకు వీసా లేకుండా ప్రయాణం చేసే వీలున్న అర్మేనియా, టర్కీ, అజర్బైజాన్ దేశాలకు వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఇందుకోసం ఒక్కో సీటుకు 20 నుంచి 25వేల పౌండ్లను (సరాసరి రూ.20లక్షలు) వసూలు చేస్తుండగా.. అదే 8 సీట్ల జెట్ విమానానికి 80 వేల నుంచి 1.40వేల పౌండ్లను సంపన్నులు చెల్లిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. గతంలో ప్రైవేట్ జెట్లకు నిత్యం 50 అభ్యర్థనలు వస్తుండగా ప్రస్తుతం అది 5వేలకు చేరుకుందని ప్రైవేట్ జెట్ నిర్వాహకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్