Vivek Ramaswamy: అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే.. వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు
అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీఈవోను ఏర్పాటు చేయాలని రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు.
వాషింగ్టన్ : ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన అమెరికా 2021లో కొవిడ్ వల్ల 5.9 లక్షల కోట్ల డాలర్ల సంపదను కోల్పోయింది. అప్పటి నుంచి అగ్రరాజ్యం వృద్ధి రేటు దాదాపు మందగమనంలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దానిపై రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రేసులో ఉన్న వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) స్పందించారు.
సోమవారం ఆయన ఓ కార్యక్రమంలో అమెరికా ఆర్థిక సంక్షోభం (national debt crisis) పై కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు అగ్రదేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తిని సీఈవో (CEO) గా తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రతి విభాగాన్ని సున్నా నుంచి మొదలపెడతామని పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్ లో చేసిన తప్పులు చేయకుండా అంతా పారదర్శకంగా జరిగేలా చూస్తామని తెలిపారు.
జాతీయ రుణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు జీరో బేస్ ఫెడరల్ బడ్జెట్ (zero-base budget) ను ప్రతిపాదించారు. అమెరికా జాతీయ రుణ సంక్షోభంలో ఉన్న మాట వాస్తవమేనని, దానిని పరిష్కరించడానికి రాజకీయాలకు అతీతంగా పనిచేసే సీఈవోను తీసుకుంటామని రామస్వామి అన్నారు.
‘గతంలో ఔషధరంగంలో ఎన్నో కంపెనీలకు పోటీగా బయోటిక్ కంపెనీను ఏర్పాటు చేసి అభివృద్ధి చేశాను. బ్లాక్ రాక్, వాన్గార్డ్ తో పోటీగా స్ట్రైవ్ అస్సెట్ మేనేజ్మెంట్ను తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ఫెడరల్ ప్రభుత్వానికి అంతకంటే గొప్ప పోటీగా నిలబడబోతున్నాను’ అని వివేక్ రామస్వామి అన్నారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకెళ్తున్నారు. మరోవైపు.. ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ కోసం వివేక్తో ‘ప్రత్యేక విందు’ కు పలువురికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు 50 వేల డాలర్ల పైనే చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?
భూకక్ష్యలోకి తొలిసారిగా ఇటీవల తాము ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేతసౌధం, పెంటగాన్ సహా అమెరికాకు చెందిన నౌకాస్థావరాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. -
అయిదు రోజులు నిద్ర లేకుండా లైవ్ స్ట్రీమింగ్లో ఆడి.. ప్రాణాలు హరీ
చైనాలో ఓ విద్యార్థి నిద్రాహారాలు మాని లైవ్ స్ట్రీమింగులో గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. హెనాన్స్ పింగ్డింగ్షాన్ వొకేషనల్ అండ్ టెక్నికల్ కళాశాలలో లీ హావో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. -
అప్పటి వరకూ ఈ ట్యాగ్ ధరిస్తా: మస్క్
సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్కు వచ్చారు. -
శ్రీలంక వీసా ఫ్రీ సేవలు ప్రారంభం
భారతీయులతోపాటు 7 దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్లాండ్ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజులపాటు పర్యటించవచ్చు. -
అమెరికాలో పొగమంచు.. ఢీకొట్టుకున్న 30 వాహనాలు
అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఇంటర్స్టేట్ 86 రహదారిపై సుమారు 30 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. -
రష్యా సరిహద్దులు పూర్తిగా మూసివేత: ఫిన్లాండ్
రష్యాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది. ఇప్పటికే పలు సరిహద్దు దారులను మూసివేసిన ఆ దేశం చివరి రహదారినీ మూసివేయన్నట్లు వెల్లడించింది. వలసలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. -
అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు లేదు!
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. -
మరో 11 మంది బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నాలుగో విడత బందీల విడుదల మంగళవారం ఉదయానికి పూర్తయింది. హమాస్ 11 మందిని, ఇజ్రాయెల్ 33 మందిని విడుదల చేశాయి. -
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
అమెరికాలోని పలు ఆస్పత్రులపై సైబర్ దాడి జరిగింది. దీంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సదుపాయాలకు అంతరాయం ఏర్పడింది.


తాజా వార్తలు (Latest News)
-
JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
-
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
-
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
-
IND Vs AUS: మ్యాచ్లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్కు కలిసొచ్చింది!
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య