అత్యాచారాలు చేయాలని రష్యన్లను వారి భార్యలే ప్రోత్సహిస్తున్నారు: జెలెన్స్కా ఆవేదన..!
ఉక్రెయిన్పై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న రష్యా.. లైంగిక దాడులనే ఆయుధాన్ని ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కా ఆరోపించారు. ఇందుకు రష్యన్ సైనికుల భార్యలు కూడా ప్రోత్సహిస్తుండటం విచారకరమన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ దేశంపై సాగిస్తోన్న దండయాత్రలో రష్యా సైనికులు.. లైంగిక దాడులను ఆయుధంగా వాడుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కా ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు చేయడానికి రష్యన్ బలగాలను వారి భార్యలే ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించారు.
యుద్ధాలు, అల్లర్ల సమయంలో లైంగిక హింసను అరికట్టాలన్న అంశంపై లండన్ వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సతీమణి జెలెన్స్కా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుద్ధం పేరుతో తమ దేశంలో రష్యా సైనికులు సాగిస్తున్న అకృత్యాల గురించి ఆమె మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాస్కో సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి దురాక్రమణదారులు తమ దేశంలో బహిరంగంగానే లైంగిక హింసకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు.
‘‘ఒకరిపై ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి లైంగిక హింస అనేది అత్యంత క్రూరమైన మార్గం. యుద్ధాల సమయంలో ఇలాంటివి జరిగినా బాధితులు భయంతో ఆ విషయాలను బయటపెట్టలేరు. ప్రస్తుతం మా దేశంలో వారు(రష్యన్ బలగాలు) ప్రయోగిస్తున్న మరో ఆయుధం ఇదే. దీన్ని చాలా క్రమపద్ధతిలో, బహిరంగంగానే ఉపయోగిస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న విషయాన్ని రష్యన్ సైనికులు వారి బంధువులు, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెబుతున్నారు. మరో కఠినమైన వాస్తవం ఏంటంటే.. ఈ దాడులను రష్యన్ సైనికుల భార్యలు పోత్సహించడం..! ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు చేయాలని వారు సైనికులకు చెబుతున్నారు’’ అని జెలెన్స్కా వివరించారు. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె కోరారు. ఇలాంటి యుద్ధ నేరాలకు పాల్పడేవారిని గుర్తించి.. శిక్ష విధించడం అత్యంత ఆవశ్యకమని అన్నారు.
ఉక్రెయిన్లో ఆ మధ్య పలు నగరాలను తమ అధీనంలోకి తీసుకున్న మాస్కో బలగాలు.. అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని గతంలో వార్తలు వచ్చాయి. చిన్నపిల్లలపైనా సాగిస్తున్న ఈ దారుణాలను ఉక్రెయిన్ ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్