Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
కెనడాలోని సుషి రెస్టారెంట్లో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని టిక్టాక్ వేదికగా పంచుకున్నారు. ‘మీ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా వెక్కిరిస్తారా’ అంటూ ఆమె మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా ఏదైనా తినాలనిపించినా, కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లాలన్నా, మిత్రులు కలిసినా మనకు వెంటనే రెస్టారెంట్(Restaurant) గుర్తుకు వస్తుంది. అందులో అడుగు పెట్టిన క్షణం నుంచి తిరిగి వచ్చేదాక రెస్టారెంట్ సిబ్బంది ఇచ్చే మర్యాద, పలకరింపులు మరింత ఆనందాన్నిస్తాయి. మెనూ (menu)ని చూసి నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తాం. కొన్నిసార్లు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేయడం సహజం. కెనడాలోని సుషి రెస్టారెంట్లో ఓ మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేసినందుకు ఆమె సిగ్గుపడాల్సి వచ్చింది.
కాసాండ్రా మౌరో (Cassandra Mauro), సుషి రెస్టారెంట్ (Sushi Restaurant)లో ఎదురైన అనుభవాన్ని టిక్టాక్లో పంచుకున్నారు. తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్కు వెళ్లి.. చికెన్ ఫ్రైడ్ రైస్, రొయ్యల వంటకం, నూడుల్స్తో పాటు రెండు సుషి రోల్స్ ఆర్డర్ చేశారు. అయితే అక్కడి సిబ్బంది చాలా ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేశారని భావించి వద్దు ఇక చాలు అని చెప్పారట. మేనేజర్ కూడా వాళ్ల టేబుల్ దగ్గరికి వెళ్లి బాగా ఆకలిగా ఉందా? అని అడిగారట. రెస్టారెంట్ వంటగదిలో ఉండే చెఫ్ కూడా చూసి నవ్వుతున్నట్లుగా ఆమెకు అనిపించిందని చెప్పింది. ‘మీ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా వెక్కిరిస్తారా’ అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఆమె చేసిన వ్యాఖ్యలకు సుషి రెస్టారెంట్ స్పందిస్తూ.. ఈ రెస్టారెంట్ కొరియా నుంచి వచ్చిన ఓ చిన్న కుటుంబం నడుపుతున్న వ్యాపారం. చాలా మంది నమ్మకమైన కస్టమర్లతో నడుపుతున్నాము. మీకు కలిగిన చేదు అనుభవానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. భాష రాకపోవడంతో ఇలా జరిగింది. అంతేగాని, మిమ్మల్ని అవమానించే ఉద్దేశం కాదని క్షమాపణలు కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM