Taliban: మహిళా స్వేచ్ఛపై తాలిబన్ల ఉక్కుపాదం.. జిమ్లు, పార్కుల్లోకీ నో ఎంట్రీ!
తాలిబన్ల(taliban) కబంద హస్తాల్లో అఫ్గానిస్థాన్ మహిళలు నలిగిపోతున్నారు. అడుగడునా ఆంక్షలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కాబుల్: తాలిబన్ల(taliban) కబంధ హస్తాల్లో అఫ్గానిస్థాన్ మహిళలు నలిగిపోతున్నారు. అడుగడుగునా ఆంక్షలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులు, స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతోన్న తాలిబన్ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. జిమ్లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు నిష్క్రమించిన తర్వాత 2021 ఆగస్టులో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడ్డాక అడుగడుగునా మహిళలపై ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు. మిడిల్ స్కూల్, హైస్కూల్ విద్యకు బాలికల్ని దూరం చేయడం.. అనేక రంగాల్లో మహిళల ఉద్యోగాలను పరిమితం చేయడం, ఆటలాడటంపై నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తల నుంచి కాలి వరకు దుస్తులు ధరించాలని ఆదేశించడం వంటి అనేక కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా జిమ్లు, పార్కుల్లోకి మహిళలపై నిషేధం ఈ వారం నుంచి అమలులోకి వచ్చినట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి మహమ్మద్ అకేబ్ మొహజెర్ వెల్లడించారు.
తాము అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా పార్కులు, వ్యాయామ శాలలు (జిమ్)ల్లోకి మహిళలపై నిషేధం విధించకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించినట్టు ఆయన చెప్పారు. అందుకోసం వారంలో కొన్ని రోజులు మహిళలు, ఇంకొన్ని రోజులు పురుషులను పార్కులు, జిమ్లలోకి ప్రవేశం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు తామ ఆదేశాలను ఎవరూ పాటించడంలేదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో అన్ని పార్కులు, జిమ్లలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చాలాచోట్ల పార్కుల్లో మహిళలు, పురుషులు కలిసి ఉండటం తాము గమనించామని.. దురదృష్టవశాత్తు కొందరు మహిళలు హిజాబ్ కూడా ధరించడంలేదన్నారు. అందుకే అన్ని పార్కులు, జిమ్లలోకి మహిళలు ప్రవేశంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే, ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు తాలిబన్ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరోవైపు, తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆఫ్గానిస్థాన్లో మహిళలకు సంబంధించి ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఖండించారు. జనజీవన స్రవంతి నుంచి మహిళల్ని క్రమపద్ధతిలో దూరం చేసే ఇలాంటి చర్యలు సరికాదన్నారు. ఆఫ్గానిస్థాన్లో మహిళలు, బాలికలకు అన్ని హక్కుల్ని కల్పించి వారి స్వేచ్ఛను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!