Spy: ప్రేమించి మోసం చేసిన గూఢచారి.. మహిళకు₹2కోట్ల పరిహారం!
అనగనగా ఓ గూఢచారి. తన గుర్తింపును దాచిపెట్టి నకిలీ పేరుతో అండర్ కవర్ ఆపరేషన్ చేపడతాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి తారసపడుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు.. ఇలాంటి కథలు చాలా సినిమాల్లో చూసి ఉంటారు కదా..! వాస్తవంగానూ ఇలాంటిదే జరిగింది. అయితే, ఆ గూఢచారి గురించి ప్రియురాలికి
లండన్: అనగనగా ఓ గూఢచారి. తన గుర్తింపును దాచిపెట్టి నకిలీ పేరుతో అండర్ కవర్ ఆపరేషన్ చేపడతాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి తారసపడుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు.. ఇలాంటి సీన్లు చాలా సినిమాల్లో చూసి ఉంటారు కదా..! వాస్తవంగానూ ఇలాంటిదే జరిగింది. అయితే, ఆ గూఢచారి గురించి ప్రియురాలికి అసలు విషయం తెలియడంతో తనను మోసం చేశాడంటూ ఆమె కేసు పెట్టింది. సుదీర్ఘ న్యాయపోరాటంలో గెలుపొంది.. పరిహారం కింద పోలీసుశాఖ నుంచి భారీ మొత్తంలో నగదు అందుకుంది. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మార్క్ కెన్నడీ ఓ పోలీస్ ఆఫీసర్. మెట్రోపాలిటన్ పోలీస్ పబ్లిక్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ యూనిట్ కోసం 2003లో గూఢచారిగా పనిచేశారు. ఓ అండర్ కవర్ ఆపరేషన్ నిమిత్తం పర్యావరణవేత్త అవతారమెత్తి తన పేరును మార్క్ స్టోన్గా మార్చుకున్నారు. అయితే, అదే ఏడాది పర్యావరణ కార్యకర్త కేట్ విల్సన్తో అతడికి పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్లపాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి 2005లో విడిపోయారు. అయితే, తను ప్రేమించిన వ్యక్తి పర్యావరణవేత్త కాదని, ఓ గూఢచారన్న విషయాన్ని ఐదేళ్ల తర్వాత కేట్ గుర్తించింది. అంతేకాదు, అప్పటికే మార్క్కి వివాహమైందని, మరికొందరు మహిళలతోనూ సంబంధాలున్నాయని తెలుసుకుంది.
దీంతో మార్క్ నిజాలు చెప్పకుండా నకిలీ గుర్తింపుతో తనని ప్రేమించి మోసం చేశాడని, తన వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిందంటూ కేట్.. 2010లో కోర్టును ఆశ్రయించింది. మార్క్ కెన్నడీ మోసం అప్పట్లో యూకే వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీటూ ఉద్యమం సమయంలోనూ ఈ కేసు తెరపైకి వచ్చింది. అయితే, దశాబ్దానికిపైగా కొనసాగిన ఈ కేసులో ఇన్వెస్టిగేటరీ పవర్స్ ట్రిబ్యునల్ ఇటీవల కేట్కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. మహిళ మానవ హక్కులకు భంగం కలిగిందని పేర్కొంటూ.. మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం, నేషనల్ పోలీస్ చీఫ్స్ కౌన్సిల్ కేట్కు 2.29లక్షల పౌండ్లు(రూ. 2.3కోట్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు