Earthquake: 104 గంటలపాటు మృత్యువుతో పోరాటం.. చివరకు ఆమె సంకల్పమే గెలిచింది!
తుర్కియే (Turkey)లోని కిరిఖాన్ (Kirikhan) నగంరలో భూకంప (Earthquake) ధాటికి కూలిపోయిన ఓ భవనం శిథిలాల కింద ఉండిపోయిన ఓ మహిళను సహాయక బృందాలు సురక్షితంగా బటయకు తీశాయి. ఆమెను చూసి వారంతా అద్భుతం జరిగిందని అంటున్నారు.
కిరిఖాన్: ఊపిరి సరిగా అందడం లేదు.. పైకి లేద్దామంటే మీద బరువైన వస్తువు.. చుట్టూ చూస్తే చీకటి.. బాధను పంటిబిగువన భరిస్తూ ఎంతసేపు ఉండాలో తెలియదు.. అసలు ప్రాణాలతో బతికి బయటపడతామా లేదా అని సందేహం.. క్షణక్షణం గడిచేకొద్దీ బాధ ఎక్కువవుతోంది. ఎవరైనా వచ్చి సాయం అందిస్తే బావుణ్ను అనుకుంటుంటే.. చుట్టుపక్కల ఏదో అలికిడి. ఏవో మెషీన్ల శబ్దాలు. అంతలోనే చుట్టూ ఉన్న చీకటి మెల్లగా తొలగి వెలుగు కనిపించడం ప్రారంభమైంది. తర్వాత కొన్నిచేతులు.. తనపై పడిన బరువైన వస్తువును తొలగించాయి.. ఇదీ 104 గంటలపాటు శిథిలాల కింది ఉండిపోయిన 40 ఏళ్ల జైనెప్ కహ్రామాన్ (Zeynep Kahraman) అనే మహిళ భయానక అనుభవం.
భూకంప ధాటికి తుర్కియా (Turkey)లోని కిరిఖాన్ (Kirikhan) నగంలోని ఓ భవనం శిథిలాల కింద సుమారు 104 గంటలపాటు ఉండిపోయిన జైనెప్ కహ్రామాన్ను ఇంటర్నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ (ISAR) సురక్షితంగా కాపాడింది. అంతసేపు ఆమె ప్రాణాలతో ఉండటం చూసి.. ఆమెను కాపాడిన సహాయక బృందం అద్భుతం జరిగిందని అంటున్నారు. ‘‘ఇప్పటి దాకా అద్భుతాలు జరుగుతాయంటే నమ్మేవాణ్ని కాదు.. ఇకపై నమ్ముతాను’’ అని అన్నారు ఐఎస్ఏఆర్ బృందానికి నాయకత్వం వహించిన స్టీవెన్ బేయర్. జర్మనీకి చెందిన ఆయన ప్రస్తుతం తుర్కియేలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భూకంపం శిథిలాల కింద 104 గంటలపాటు ఉండిపోయిన జైనెప్ కహ్రామాన్ను సురక్షితంగా కాపాడిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బతకాలన్న ఆమె సంకల్పం ముందు మరణం సైతం చిన్నబోయిందని ఆమెను కనిపెట్టిన రెస్యూ కుక్కను నడిపించే తమరా రీథర్ అన్నారు. ప్రస్తుతం జైనెప్ కహ్రామాన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రకృతి విలయంతో కకావికలమైన తుర్కియే (Turkey), సిరియా (Syria)లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే విపరీతంగా కురుస్తున్న మంచు, వరుసగా వస్తున్న ప్రకంపనలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. మరోవైపు భూకంప సహాయక చర్యల్లో అత్యంత కీలకమైన 72 గంటలు కూడా ముగియడంతో.. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు క్షణక్షణానికి సన్నగిల్లుతున్నాయి. ఈ క్రమంలోనే సహాయక సిబ్బంది కాపాడిన వారిలో కొందరు ప్రాణాలతో బయటపడుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..