Dirtiest Man: 60ఏళ్లుగా స్నానానికి దూరం.. ప్రపంచంలోనే అత్యంత ‘మురికి వ్యక్తి’ మృతి
ఇరాన్కు చెందిన ఓ వృద్ధుడు (94) అరవై ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉంటున్నాడు. దాంతో ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా పేరుగాంచాడు. అటువంటి వింత వ్యక్తి ఇటీవలే కన్నుమూసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్కు చెందిన ఓ వృద్ధుడు (94) ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తిగా పేరు గాంచాడు. అరవై ఏళ్లలో ఆయన ఒక్కసారి కూడా స్నానం చేయలేదట. అటువంటి వింత వ్యక్తి ఇటీవలే స్నానం చేశాడు. సుమారు ఆరు దశాబ్దాలుగా స్నానానికి దూరంగా ఉన్న అతడు మృతి చెందినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
అమౌ హజీ అనే వ్యక్తి ఇరాన్లోని ఫార్స్ ప్రావిన్సులోని డెజ్గా గ్రామంలో ఒంటరిగా నివసించేవాడు. ఆయన కుటుంబీకులు ఎవ్వరూ లేకపోవడంతో గ్రామస్థులే చిన్న నివాసాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయనకు స్నానమంటే అసహ్యం. కనీసం సబ్బుతో ముఖం, కాళ్లు, చేతులు కడుక్కున్న దాఖలాలూ లేవట. రోడ్డుపైన చనిపోయిన మూగజీవాలను తినడంతోపాటు నాలుగైదు సిగరెట్లనూ ఒకేసారి పీల్చేవాడట. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారిన పడతాననే అపోహతోనే ఆ వృద్ధుడు అరవై ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉండిపోయాడట.
ఇలా వింత జీవితాన్ని గడుపుతోన్న ఆ వృద్ధుడిపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. అటువంటి వ్యక్తికి గ్రామస్థులందరూ కలిసి ఇటీవల బలవంతంగా స్నానం చేయించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే (అక్టోబర్ 23న) ఆ వృద్ధుడు కన్నుమూయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
-
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
-
ఇట్లుంటది జగన్ తోని.. ఒంగోలు బ్రాండ్కే బ్యాండ్
-
ఏది నిజం?సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
-
పార్టీలు మంచి చేస్తే రాజకీయాల్లోకి రాను: నటుడు విశాల్