Modi: హిరోషిమా పేరు వింటేనే.. ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుంది: మోదీ
ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ(Modi) ప్రస్తుతం జపాన్లో ఉన్నారు. హిరోషిమా(Hiroshima) పట్టణంలో జరుగుతోన్న జీ7 సదస్సు కోసం అక్కడికి వెళ్లారు. ఈ సందర్బంగా అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
హిరోషిమా: ఇప్పటికీ హిరోషిమా(Hiroshima) పేరు వింటే ప్రపంచం వణికిపోతుందని ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) అన్నారు. ప్రస్తుతం జీ7 సదస్సు(G7 summit)లో భాగంగా జపాన్లో పర్యటిస్తోన్న ఆయన.. శనివారం హిరోషిమా పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ(Modi) శుక్రవారం జపాన్(Japan) వెళ్లారు. హిరోషిమా చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. పొరుగుదేశాలతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాజాగా ఈ రోజు ఆ పట్టణంలోని మొటొయాసు నది సమీపంలో మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అణుబాంబు దాడి కారణంగా మృత్యువాతపడ్డ వేలమంది జ్ఞాపకార్థం నిర్మించిన శాంతివనానికి దగ్గర్లో దీనిని ఏర్పాటు చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ..‘హిరోషిమా(Hiroshima) పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుంది. జీ7 సదస్సు కోసం వచ్చిన సందర్భంగా గాంధీ విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’అని అన్నారు.
ఇదీ చదవండి: అణుబాంబుకు ఆహుతై.. అగ్రరాజ్యాల సదస్సుకు వేదికై..!
ప్రస్తుతం ప్రపంచం వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కొంటోందని, వాటిపై విజయం సాధించేందుకు గాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే సరైన మార్గమన్నారు. ఇక్కడ ఈ విగ్రహ ఏర్పాటు మహాత్ముడి సిద్ధాంతమైన అహింసను ముందుకు తీసుకెళ్తుందన్నారు. ‘నేను జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని ఇక్కడ నాటారని తెలిసింది. అది నాకు గొప్ప అనుభూతినిచ్చింది. ఇక్కడకు వచ్చిన ప్రజలు.. వీటన్నింటి ద్వారా శాంతి ఆవశ్యకతను అర్థం చేసుకుంటారు’ అంటూ గాంధీకి నివాళి అర్పించారు. ఈ విగ్రహాన్ని పద్మభూషణ్ గ్రహీత అయిన రామ్ వాంజీ సుతర్ రూపొందించారు. ఈ కార్యక్రమం తర్వాత హిరోషిమా(Hiroshima)లోని ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీVolodymyr Zelensky).. ప్రధాని మోదీతో అక్కడ శనివారం సాయంత్రం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ఈ ఇరువురు నేతలు నేరుగా భేటీ అవడం ఇదే తొలిసారి కానుంది. ఇదిలా ఉంటే.. ఈ యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి అణుభయాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో అణుభూమి హిరోషిమా(Hiroshima)లో జీ7 సదస్సు ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలను చైనా దాచిపెడుతోందని నాసా అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. -
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ