WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో కొత్త ఒప్పందం కోసం జరుగుతోన్న చర్చలు ట్విటర్ వార్కు దారితీసింది. మస్క్(Elon Musk) చేసిన ట్వీట్పై టెడ్రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య ట్వీట్ల వార్ జరిగింది. భవిష్యత్తు మహమ్మారులను నిరోధించడం, వాటి విషయంలో వేగంగా స్పందించే ఉద్దేశంతో కొత్త ఒప్పందం దిశగా దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మస్క్ చేసిన ట్వీట్ టెడ్రోస్ అధనామ్(Tedros Adhanom) ఆగ్రహానికి దారితీసింది.
ఈ కొత్త ఒప్పందం చర్చలను ఉద్దేశించి మస్క్(Elon Musk) స్పందిస్తూ.. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థకు దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని అప్పగించొద్దు’ అని వ్యాఖ్యానించారు. దానికి టెడ్రోస్(Tedros Adhanom) ఘాటుగా బదులిస్తూ.. నకిలీ వార్తల పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘ఆరోగ్య సంస్థకు దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని అప్పగించడం లేదు. మమ్మారులకు సంబంధించి చేసుకునే ఒప్పందం దానిని మార్చదు. కేవలం మహమ్మారులను మెరుగ్గా అడ్డుకోవడానికి మాత్రమే ఇది ఉపకరిస్తుంది. ప్రజలు పేద లేక ధనిక దేశంలో నివసిస్తున్నారా..? అనే దానితో సంబంధం లేకుండా వారిని రక్షించేందుకు ఇది సాయపడుతుంది’ అంటూ సమాధానమిచ్చారు. మస్క్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు. అలాగే తమ దేశ చట్టాలను అనుసరించి అవి ఈ ఒప్పందాన్ని అమలు చేసుకుంటాయని చెప్పారు.
మూడేళ్ల క్రితం ప్రపంచ దేశాలను కరోనా(coronavirus) వణికించింది. ఆ వైరస్ ప్రస్తుతానికి అదుపులోనే ఉంది. అయితే కరోనా ప్రారంభ సమయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే విషయంలో ఆసల్యం, సమాచార బదిలీ తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే, ఇలా మహమ్మారులు సంభవించినప్పుడు వేగంగా సమాచార బదిలీకి, వ్యాక్సిన్ల పంపిణీలో ఉన్న అసమానతలను తొలగించేలా ఒప్పందం కోసం చర్చలు సాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Maldives Parliament Elections: మాల్దీవుల్లో ఎన్నికలు.. భారత్కు బ్యాలెట్ బాక్సులు..!
మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికలు కేరళలోని తిరువనంతపురంలోనూ నిర్వహించనున్నారు. భారత్తో దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చర్చనీయాంశమైంది. -
Putin: నావల్నీని విడిచిపెట్టాలనుకున్నాం.. ప్రత్యర్థి మృతిపై పుతిన్ తొలి స్పందన
Putin: గత నెల జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తొలిసారి స్పందించారు. -
రెక్క కింద ప్యానెల్ లేకుండానే ప్రయాణించిన విమానం
యునైటెడ్ ఎయిర్ లైన్స్కు చెందిన ఓ విమానం రెక్క కింద ప్యానెల్ లేకుండానే ప్రయాణించింది. అదృష్టవశాత్తు అది సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. -
‘స్పేస్ఎక్స్’ సాయంతో అమెరికా నిఘా నెట్వర్క్!
ఎలాన్ మస్క్కు చెందిన ‘స్పేస్ఎక్స్’ ప్రపంచం కనీవినీ ఎరుగని స్థాయిలో అమెరికాకు నిఘా శాటిలైట్ నెట్వర్క్ను నిర్మిస్తోంది. -
నేను గెలవకపోతే అమెరికాలో రక్తపాతమే: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయనున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
పలచనవుతున్న మంచు పొరలు
శీతాకాలంలో పడే మంచు తరవాతి నెలల్లో తాగునీరు, సాగు నీటికి మూలాధారమవుతుంది. ఇతర అవసరాలకూ అదే ఆధారం. -
కొవిడ్కు అసహజ కారణాలు
ప్రయోగశాలల్లో ప్రమాదం జరగడం కారణంగా, అనుకోకుండా లీకేజీ సంభవించడం వల్లనో వైరస్ బయటపడి కొవిడ్ 19కు దారి తీసి ఉండొచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
పాకిస్థాన్లో సైనిక స్థావరంపైఆత్మాహుతి దాడి..
వాయవ్య పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రం ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. -
పాకిస్థాన్ చేతికి చైనా నిఘా నౌక
పాకిస్థాన్ నౌకాదళం మొట్టమొదటిసారిగా ఒక నిఘా నౌకను సమకూర్చుకుంది. చైనా నుంచి దీన్ని సేకరించింది. -
భారీ ఆధిక్యంతో పుతిన్కు పట్టం!
మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు దాదాపు 88% ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. -
విశ్వాన్ని తీర్చిదిద్దిన కృష్ణపదార్థం!
విశ్వంలో పదార్థం- కృష్ణపదార్థం మధ్య నెలకొన్న అసమతౌల్యాన్ని వివరించేందుకు ఒక వినూత్న సిద్ధాంతాన్ని గువాహటి ఐఐటీ శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ పరిశోధకులు ప్రతిపాదించారు. -
కేట్ మిడిల్టన్ గురించి సిబ్బందికీ సమాచారం లేదు!
బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ అదృశ్యంపై అమెరికాకు చెందిన న్యూయార్క్ పోస్ట్ తాజాగా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. -
సంపూర్ణ విజయం దక్కేవరకు యుద్ధ విరమణ లేదు: నెతన్యాహు
సంపూర్ణ విజయం సాధించేవరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. -
అఫ్గాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృత్యువాత
అఫ్గానిస్థాన్లోని హెల్మాండ్ ప్రావిన్సు గెరాష్క్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. -
మా సముద్ర ప్రాంత రక్షణ బయటిశక్తుల పని కాదు
మాల్దీవుల సముద్ర ప్రాంత రక్షణ బయటి శక్తుల పని కాదని, తామే రక్షణ బలగాలను పెంచుకుంటామని, డ్రోన్ల సాయంతో నిఘా ఏర్పాట్లు చేసుకుంటామని ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు. -
ట్రంప్ వృద్ధుడు, మానసిక అసమర్థుడు: బైడెన్
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు పోటీపడుతున్నారు. అందులో ఒకరు మరీ వృద్ధుడు, మానసికంగా అసమర్థుడు. -
అమెరికాలో కాల్పుల మోత.. రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
అమెరికాలో తుపాకీ విష సంస్కృతి మరో ముగ్గురిని బలి తీసుకుంది. రెండు వేర్వేరు ఘటనల్లో 10 మంది వరకు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. -
Chinese military: ‘అరుణాచల్ ప్రదేశ్’పై.. చైనా సైన్యం మరోసారి కారుకూతలు!
అరుణాల్ ప్రదేశ్.. తమ అంతర్భాగమే అంటూ చైనా సైన్యం మరోసారి మొండి వాదనకు దిగింది.
తాజా వార్తలు (Latest News)
-
PM Modi: ఆ సవాల్ను స్వీకరిస్తున్నా.. రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యలకు మోదీ జవాబు
-
Adani group: నష్టాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. అమెరికా దర్యాప్తు ఎఫెక్ట్
-
Jio - IPL: ఐపీఎల్ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్లు
-
Nadendla Manohar: బొప్పూడి సభలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది: నాదెండ్ల మనోహర్
-
Maldives Parliament Elections: మాల్దీవుల్లో ఎన్నికలు.. భారత్కు బ్యాలెట్ బాక్సులు..!
-
BRS: దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కలిసిన భారాస నేతలు