World War II: ఓ సైనికుడి లేఖ.. 76 ఏళ్ల తర్వాత కుటుంబానికి చేరిక!
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో జర్మనీలో ఉన్న ఓ అమెరికా సైనికుడు తన తల్లికి రాసిన లేఖ ఇన్నాళ్లకు ఇంటికి చేరుకోవడం గమనార్హం. ఇందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 76 ఏళ్లు పట్టింది. అగ్రరాజ్యంలోని మాసాచుసెట్స్ వోబర్న్కు చెందిన...
ఇంటర్నెట్ డెస్క్: రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో జర్మనీలో ఉన్న ఓ అమెరికా సైనికుడు తన తల్లికి రాసిన లేఖ ఇన్నాళ్లకు ఇంటికి చేరుకోవడం గమనార్హం. ఇందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 76 ఏళ్లు పట్టింది. అగ్రరాజ్యంలోని మాసాచుసెట్స్ వోబర్న్కు చెందిన జాన్ గోన్సాల్వ్స్.. దేశ సైన్యం తరఫున 1945 డిసెంబర్లో జర్మనీలో విధుల్లో ఉన్నాడు. అప్పుడతని వయస్సు 22. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది. ఆ సమయంలో అతను తన తల్లికి ఓ లేఖ రాశాడు.
‘డియర్ మామ్. ఈ రోజు మీ నుంచి మరొక లేఖ వచ్చింది. అక్కడ అంతా క్షేమమేనని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. నా విషయానికొస్తే, ఇక్కడ బాగానే ఉన్నా. కానీ, ఆహారమే.. చాలావరకు బాగుండటం లేదు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నా- మీ కుమారుడు జానీ’ అని అందులో రాసి ఉంది. కానీ, అప్పుడది ఇంటికి చేరలేదు. తాజాగా పిట్స్బర్గ్లోని యూఎస్ పోస్టల్ సర్వీస్(యూఎస్పీఎస్) డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీలో బయటపడింది. దశాబ్దాలుగా తెరవకుండా అలాగే ఉన్న ఆ లేఖను.. పోస్టల్ సిబ్బంది ఇటీవల అతని భార్య ఏంజెలీనా(89) చిరునామా కనుక్కొని పంపారు.
‘ఈ లేఖను చేరవేయడం చాలా ముఖ్యం’ అంటూ పోస్టల్ సిబ్బంది.. తమ సొంత లేఖనూ దాంతో జతచేశారు. ఎట్టకేలకు ఉత్తరాన్ని అందుకున్న అతని కుటుంబం.. పోస్టల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది. ఇదిలా ఉండగా.. గోన్సాల్వ్స్ 2015లో మరణించగా, అతని తల్లి కూడా అప్పటికే కన్నుమూశారు. తాజాగా ఈ లేఖ అందుకున్న భార్య మాత్రం.. ‘ఒక్కసారి ఊహించుకోండి! ఏకంగా 76 ఏళ్లు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘నమ్మలేకపోయా. కానీ.. ఇది అతని చేతి రాతే. ఇదంతా చాలా అద్భుతంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. ‘అతనే నా వద్దకు తిరిగి వచ్చినట్లు ఉంది.. తెలుసా?’ అని ఉద్విగ్నులయ్యారు. జాన్ ఈ ఉత్తరం పంపిన ఐదేళ్లకు ఆమె పరిచయమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు