Worlds Deepest Hotel: అత్యంత లోతులో హోటల్.. ప్రయాణం కూడా సాహసమే!
బ్రిటన్లోని ‘ది డీప్ స్లీప్ హోటల్’కు ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్గా పేరుంది. భూఉపరితలానికి దాదాపు 400 మీటర్లకు (1375 అడుగులు)పైగా లోతులో ఉందిదీ.
లండన్: ప్రపంచంలో అనేక హోటళ్లు వాటికవే కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో బ్రిటన్ (Britain)లోని ‘ది డీప్ స్లీప్ హోటల్ (Deep Sleep Hotel)’ ఒకటి. భూగర్భంలో ఏర్పాటు చేసిన దీనికి.. ప్రపంచంలోనే అత్యంత లోతైన హోటల్ (World's Deepest Hotel)గా గుర్తింపు ఉంది. దీన్ని చేరుకునేందుకు ఓ సాహస యాత్రే చేయాల్సి ఉంటుంది. బండరాళ్ల గనుల గుండా ట్రెక్కింగ్ చేస్తూ.. అనేక పురాతన వంతెనలు, మెట్ల బావులు దాటుకుంటూ.. కఠిన దారుల్లో గంటకుపైగా నడక సాగించాల్సిందే.
బ్రిటన్ నార్త్ వేల్స్లోని ఎరారీ నేషనల్ పార్క్లో పర్వతాల కింద ఈ హోటల్ను నిర్మించారు. భూఉపరితలానికి దాదాపు 400 మీటర్లకు (1375 అడుగులు)పైగా లోతులో ఉంది. డీప్ స్లీప్ హోటల్లో రెండు పడకలతోకూడిన నాలుగు ప్రైవేటు క్యాబిన్లు, డబుల్ బెడ్తో కూడిన ఒక ప్రత్యేక గుహను గదివలే తీర్చిదిద్దారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అద్దెకు తీసుకోవచ్చు. ప్రైవేటు క్యాబిన్లో ఇద్దరి బసకు 350 పౌండ్లు (రూ.36 వేలు), గుహ గదికిగానూ 550 పౌండ్లు (రూ.56 వేలు) చెల్లించాలి.
ఈ హోటల్లో బస చేయాలనుకునేవారు ముందుగా ట్రిప్ లీడర్ వెంట పాడుబడిన విక్టోరియన్ బండరాళ్ల గనుల గుండా ట్రెక్కింగ్ చేయాలి. మెట్ల బావులు, పాత వంతెనలు దాటుకుంటూ.. కఠిన మార్గాల్లో గంటపాటు ప్రయాణించాలి. చివరకు ఒక పెద్ద ఉక్కు తలుపు.. ప్రవేశ ద్వారాన్ని సూచిస్తుంది. ప్రయాణ మార్గంలో అతిథులకు హెల్మెట్, లైట్, బూట్లు ఇతరత్రా వస్తువులు సమకూరుస్తారు. ఈ హోటల్లో గడిపినవారు తమ జీవితంలోనే మంచి నిద్రను పొందామంటూ చెబుతున్నారని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.