Hijab Row: హిజాబ్ లేకుండా అంతర్జాతీయ పోటీల్లో.. ఇరాన్ క్రీడాకారిణికి అరెస్టు భయం..!
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ ఇరాన్ క్రీడాకారిణి (Athlete) కూడా హిజాబ్ లేకుండానే తన ఆటను కొనసాగించి వార్తల్లో నిలిచారు.
సియోల్: హిజాబ్కు (Hijab) వ్యతిరేకంగా ఇరాన్లో దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వేల మంది ఇరాన్ మహిళలు ప్రాణాలకు తెగించి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ ఇరాన్ క్రీడాకారిణి (Athlete) కూడా హిజాబ్ లేకుండానే తన ఆటను కొనసాగించి వార్తల్లో నిలిచారు. అయితే, దీనిపై ఇప్పటికే ఇరాన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే అక్కడ నుంచి స్వదేశానికి పిలిపించారని.. అక్కడికి చేరగానే ఆమె అరెస్టు కావొచ్చని మీడియా పేర్కొంది.
దక్షిణ కొరియాలో జరుగుతోన్న ఏషియన్ క్లైంబింగ్ ఛాంపియన్షిప్లో ఆదివారం జరిగిన ఫైనల్స్లో ఇరాన్కు చెందిన ఎల్నాజ్ రెకాబీ (33) పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే సమయంలో తమ క్రీడాకారిణులు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని ఇరాన్ నిబంధనల్లో ఉంది. కానీ, రెకాబీ మాత్రం అలా ధరించలేదు. ఈ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచిన ఆమె.. ఇరాన్లో జరుగుతోన్న హిజాబ్ వ్యతిరేక ఆందోళనకు మద్దతుగానే అలా చేసిందనే కోణంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆట ముగిసిన తర్వాత ఆ క్రీడాకారిణి కనిపించకుండా పోయిందనే వార్తలూ చక్కర్లు కొట్టాయి. అదే సమయంలో ఆమె తన స్నేహితులకు ఫోన్లోలో అందుబాటులో లేకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
ఇలా అంతర్జాతీయ పోటీల్లో హిజాబ్ అంశం చర్చనీయాంశం కావడంతో చివరకు రెకాబీ స్పందించారు. హిజాబ్ ధరించకపోవడం ఉద్దేశపూర్వకంగా కాదని.. అనుకోకుండా అలా జరిగిందని వివరణ ఇచ్చారు. మరోవైపు క్లైంబింగ్ క్రీడాకారిణి కనిపించలేదంటూ వచ్చిన వార్తలను దక్షిణ కొరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. షెడ్యూల్ ప్రకారం ఆమె బుధవారం స్వదేశానికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. మంగళవారం ఉదయమే దక్షిణ కొరియా నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. -
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?