Indo-China: యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?: జిన్పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ సిబ్బందితో మాట్లాడారు. యుద్ధ సన్నద్ధతపై వారిని ప్రశ్నించారు.
బీజింగ్: భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో డ్రాగన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)తో అధ్యక్షుడు షీ జిన్పింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ‘యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’అని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. పీఎల్ఏ ప్రధాన కార్యాలయం నుంచి ఆర్మీ జవాన్లతో జిన్పింగ్ మాట్లాడుతూ..యుద్ధ సన్నద్ధతపై వారిని ప్రశ్నించినట్లు అక్కడి అధికార మీడియా వెల్లడించింది. సరిహద్దులో పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు తెలిపింది. ఇటీవల కాలంలో సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, దానివల్ల ఆర్మీకి ఎదురవుతున్న సవాళ్లను అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
సరిహద్దు ప్రాంతాన్ని 24 గంటల పాటు కంటికి రెప్పలా కాపాడుతున్నామని, కట్టుదిట్టంగా భద్రతను పర్యవేక్షిస్తున్నామని ఆర్మీ జవాన్లు జిన్పింగ్కు చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అత్యంత క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లను జిన్పింగ్ అభినందించారు. తాజా ఆహారపదార్థాలు అందుతున్నాయో లేదోనని వాకబు చేశారు. వారందరినీ సరిహద్దు రక్షకులుగా అభివర్ణించిన ఆయన.. వారిలో నూతన ఉత్తేజం కలిగేలా మాట్లాడారు. 2020, మే 5న లద్దాఖ్లోని ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘటన చోటు చేసుకున్న తర్వాత ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య 17 సార్లు అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఓ వైపు తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నామని డ్రాగన్ చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతత అవసరమని నొక్కి చెబుతూనే.. ప్రత్యర్థి ఎత్తుగడలను అంచనా వేస్తూ భారత్ కూడా తమ దళాలను మోహరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?