Corona: ఈ ఎయిర్ క్లిప్ కరోనా వైరస్ను కనిపెడుతుంది!
కొంతమందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యే వరకు వారికి వైరస్ సోకిన విషయం తెలియట్లేదు. మరికొంతమంది అస్వస్థతకి గురికాకున్నా కరోనా బారిన పడుతున్నారు. టెస్ట్ చేయించుకునేలోపు అలాంటి వారంతా అందరితో కలివిడిగా తిరగడం వల్ల ఇతరులకూ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా
ఇంటర్నెట్ డెస్క్: కొంతమందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యే వరకు వారికి కరోనా వైరస్ సోకిన విషయం తెలియట్లేదు. మరికొంతమంది అస్వస్థతకి గురికాకున్నా కరోనా బారిన పడుతున్నారు. అయితే, వారు టెస్ట్ చేయించుకుని పాజిటివ్ అని తెలుసుకునేలోపు అందరితో కలివిడిగా తిరగడం వల్ల ఇతరులకూ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇదే ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే, ఈ సమస్యకు ఆమెరికాలోని యాలె యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ పరిష్కారం కనుగొన్నారు. వ్యాప్తి తీవ్రం కాకముందే వైరస్ను గుర్తించేలా ‘ఫ్రెష్ ఎయిర్ క్లిప్’అనే డివైజ్ను రూపొందించారు.
బ్యాడ్జ్లా ధరించగలిగే ఈ ఎయిర్ క్లిప్లో వైరస్ను గుర్తించే సాంకేతికతను అమర్చారు. ఇది గాల్లోని తుంపర్లను సేకరించి, అందులో వైరస్ను గుర్తించి వెంటనే అప్రమత్తం చేస్తుంది. దీంతో కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిందో లేదో పరీక్షలు చేయించుకొని నిర్థరణకు రావొచ్చు. ఆదిలోనే వైరస్ను గుర్తించి క్వారంటైన్లోకి వెళ్లడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. అంతేకాదు.. గాలిలో వైరస్ సాంద్రతను అంచనా వేయడానికి కూడా ఈ డివైజ్ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఎయిర్ క్లిప్ పనితీరు పరిశీలనలో భాగంగా స్థానికంగా నివసిస్తున్న 62 మందికి ఈ క్లిప్ను ధరించమని చెప్పి.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు పంపించారు. అయితే, వారిలో 8 శాతం మంది క్లిప్లపై కరోనా వైరస్ను గుర్తించారు. ఈ డివైజ్లు పరిమాణంలో చిన్నగా.. ధరించడానికి సౌకర్యంగా ఉంటాయని, ధర కూడా చాలా తక్కువగా ఉంటుందని యాలె పరిశోధకులు వెల్లడించారు. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.