Ukraine Crisis: జపోరిజియాపై భీకర దాడులు.. 17 మంది మృతి!
జపోరిజియా నగరంపై జరిగిన భీకర క్షిపణి దాడుల్లో 17 మంది మృతి చెందారు. దాదాపు 40కిపైగా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ ఆదివారం ధ్రువీకరించింది. ఈ దాడుల్లో దాదాపు 50కిపైగా అపార్ట్మెంట్లు, 20 ఇళ్లు దెబ్బతిన్నాయి.
కీవ్: ఒకవైపు రష్యా(Russia) సేనలపై ఉక్రెయిన్ బలగాలు పైచేయి సాధిస్తోన్నా.. మరోవైపు ఎడాపెడా దాడులతో పెద్దఎత్తున ప్రాణనష్టం కొనసాగుతూనే ఉంది. తాజాగా జపోరిజియా(Zaporizhzhia) నగరంపై జరిగిన భీకర క్షిపణి దాడుల్లో 17 మంది మృతి చెందారు. దాదాపు 40కిపైగా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ ఆదివారం ధ్రువీకరించింది. ‘జపోరిజియా నగరంపై రాత్రి జరిగిన క్షిపణి దాడుల్లో దాదాపు 50కిపైగా అపార్ట్మెంట్లు, 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని జపోరిజియా సిటీ కౌన్సిల్ కార్యదర్శి అనటోలీ కుర్తేవ్ వెల్లడించారు. నాలుగు విద్యాసంస్థలు కూడా ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు.
ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. ‘మరోసారి జపోరిజియాను లక్ష్యంగా చేసుకున్నారు. శాంతియుత ప్రజలపై కనికరం లేకుండా చేపట్టిన దాడులు ఇవి. నివాస భవనాలపై.. అదీ అర్ధరాత్రి వేళలో..’ అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఆరుగురు పిల్లలతోసహా 49 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని దుర్మార్గులు, ఉగ్రవాదులుగా అభివర్ణించారు. ‘ఇది క్రూరమైన చర్య. ఈ దాడులకు అనుమతి ఇచ్చిన వ్యక్తి నుంచి దీన్ని అమలు చేసిన ప్రతి ఒక్కరు.. చట్టం ముందు, ఉక్రెయిన్వాసుల ముందు జవాబుదారీగా ఉండాల్సిందే’ అని పేర్కొన్నారు. మరోవైపు.. తమ వద్ద పశ్చిమ దేశాల ఆధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలు ఉంటే ఇటువంటి దాడులను అడ్డుకోవచ్చని ఉక్రెయిన్ సైన్యం ట్వీట్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా