Ukraine Crisis: రష్యా ప్రణాళికను దెబ్బతీశాం.. కీవ్ మా ఆధీనంలోనే ఉంది..!
ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడానికి క్రెమ్లిన్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు.
వెల్లడించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడానికి క్రెమ్లిన్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తన ప్రభుత్వాన్ని కూలదోసి, ఒక తోలుబొమ్మను కొలువుదీర్చాలని పుతిన్ చూస్తున్నారని ఆరోపించారు. తమపై రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న దాడిని ఆపేలా రష్యన్లు ఒత్తిడి తేవాలని కోరారు. అలాగే ఈ సైనిక చర్యను వ్యతిరేకిస్తున్న రష్యన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
‘రష్యన్ సేనల ప్రణాళికను మేం విఫలం చేశాం. కీవ్ ఇప్పటికీ ఉక్రెయిన్ ఆర్మీ నియంత్రణలోనే ఉంది. దాని చుట్టూ ఉన్న ప్రధాన నగరాలు కూడా మాతోనే ఉన్నాయి’ అని జెలెన్స్కీ తాజాగా వీడియో సందేశం విడుదల చేశారు. ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యన్ సేనలు ‘క్షిపణులు, ఫైటర్లు, డ్రోన్లు, ఫిరంగిదళాలు, సాయుధ వాహనాలు, విధ్వంసకారులు, వైమానిక దళాలు’ ను మోహరించాయి. నివాస ప్రాంతాలపై కూడా దాడి చేశాయని మండిపడ్డారు. కీవ్తో సహా ప్రధాన నగరాల్లో ఉక్రేనియన్లు రష్యన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని వెల్లడించారు. మరికొన్ని నగరాల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
అలాగే యూరోపియన్ యూనియన్(ఈయూ)లో చేరే హక్కును ఉక్రెయిన్ ఇప్పటికే పొందిందని, ఈయూ నేతలు అందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేగాకుండా స్విఫ్ట్ నుంచి రష్యాను డిస్కనెక్ట్ చేసేందుకు ఈయూ దేశాల నుంచి పూర్తి మద్దతు లభించిందన్నారు. జర్మనీ, హంగరీ కూడా ఇప్పుడు ఆ ధైర్యం చేస్తాయన్నారు. ఇంకోపక్క ఈ సైనిక చర్యను వ్యతిరేకించిన రష్యన్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అదే తీరుగా పుతిన్పై ఒత్తిడిని కొనసాగించాలని అభ్యర్థించారు. మనకు, ఈ ప్రపంచానికి అబద్ధాలు చెప్పేవారిని నిలువరించాలని కోరారు. ‘వేల సంఖ్యలో బాధితులు, వందల సంఖ్యలో ఖైదీలుగా ఉన్నారు. యుద్ధం తక్షణం ఆగిపోవాలని మీరు ఎంత త్వరగా ప్రభుత్వానికి చెబితే.. అంత ఎక్కువమంది బతుకుతారు’ అని జెలెన్స్కీ తాజా వీడియో సందేశంలో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భార్యకు ఏదైనా జరిగితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
Imran Khan: తన భార్య అవినీతి కేసులో అరెస్టు కావడం, దోషిగా తేలి శిక్ష అనుభవించడానికి పాక్ ఆర్మీ చీఫే కారణమని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. -
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. -
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై