Ukraine Crisis: పుతిన్ ఉన్నంత వరకు చర్చలకు వెళ్లం: జెలెన్ స్కీ
ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఆదేశంతో చర్చలు జరపబోమని తేల్చి చెప్పారు.
కీవ్: ఉక్రెయిన్లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్క్స్,దొనెట్క్స్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. వీలైనంత తొందరగా ఉక్రెయిన్ను నాటో కూటమిలో చేర్పించుకోవాలని ఆ కూటమి దేశాలను అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘నాటో కూటమిలో చేరేందుకు మాకున్న అర్హతలను ఇప్పటికే నిరూపించుకున్నాం. నాటోలో వీలైనంత తొందరగా ప్రవేశించేందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేయడం ద్వారా నిర్ణయాత్మక ముందడుగు వేస్తున్నాం’’ అంటూ జెలెన్ స్కీ తన వీడియోలో పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంత వరకు ఆ దేశంతో చర్చలు జరపబోమని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.‘‘రష్యా అధ్యక్ష పదవిలో పుతిన్ ఉన్నంతవరకు ఉక్రెయిన్ ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోదు. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యాక మేం చర్చలకు సిద్ధంగా ఉంటాం’’అని పేర్కొన్నారు.
దాదాపు ఎనిమిది నెలలుగా జరుగుతున్న యుద్ధం తర్వాత ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు పుతిన్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ఉక్రెయిన్లోని ఈ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తూ.. చర్చలకు రావాలని ఉక్రెయిన్కు సూచించారు. కొత్తగా విలీనం చేసుకున్న ప్రాంతాలను మాత్రం రష్యా ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోదని పుతిన్ తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
ప్రమాదకర టాస్క్లతో యువతను ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందనే విమర్శలున్న బ్లూవేల్ ఛాలెంజ్ (Blue Whale Challenge) మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. -
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. -
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?