Zelenskyy: రష్యాపై మరిన్ని ఆంక్షల నిర్ణయం వేళ.. జపాన్లో అడుగుపెట్టిన జెలెన్స్కీ!
జీ7 సదస్సులో పాల్గొనేందుకుగానూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జపాన్కు చేరుకున్నారు. రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలని తాజాగా నిర్ణయించడం.. ప్రతిగా రష్యా సైతం 500 మంది అమెరికన్లను తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించిన వేళ జెలెన్స్కీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
టోక్యో: ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా సైనిక చర్య 15 నెలలకుపైగా కొనసాగుతోన్న వేళ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) నేడు జపాన్ (Japan) చేరుకున్నారు. అగ్రరాజ్యాల జీ7 సదస్సు (G7 Summit)లో పాల్గోనేందుకుగానూ ఆయన ఇక్కడి హిరోషిమా (Hiroshima)లో అడుగుపెట్టారు. రష్యా దాడులు మొదలైన అనంతరం జెలెన్స్కీ పర్యటిస్తోన్న మొదటి ఆసియా దేశం ఇది. ఇందులో భాగంగా ఆయన జీ7 దేశాల ప్రతినిధులతోపాటు ఇతర ఆహ్వానిత దేశాల నేతలతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్- రష్యా వివాదంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జీ7 సదస్సులో భాగంగా సభ్యదేశాలు ఉక్రెయిన్పై ప్రత్యేక ప్రకటన విడుదల చేశాయి. ‘ఉక్రెయిన్పై రష్యా చేపడుతోన్న చట్టవిరుద్ధ, అన్యాయమైన యుద్ధానికి వ్యతిరేకంగా కలిసి నిలబడాలనే జీ7 దేశాల నిబద్ధతను పునరుద్ఘాటించాం. ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘిస్తోన్న రష్యా వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రయత్నాలన్నింటినీ సమీకరించి.. ఉక్రెయిన్తో కలిసి పని చేస్తామని ‘శాంతికి చిహ్నం’ అయిన హిరోషిమా వేదికగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఉక్రెయిన్లో శాంతిస్థాపన దిశగా సహకరిస్తాం’ అని అందులో పేర్కొన్నాయి.
జపాన్ పర్యటనలో భాగంగా జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తదితర నేతలతో విడిగా భేటీ కానున్నట్లు సమాచారం. అంతకుముందు హిరోషిమాకు చేరుకున్న సందర్భంగా ‘జీ7 సదస్సులో భాగంగా ఉక్రెయిన్ మిత్ర దేశాలు, భాగస్వాములతో ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొననున్నా. రష్యాపై విజయం కోసం మరింత భద్రత సహకార చర్యలను ఆకాంక్షిస్తున్నా. నేడు శాంతిస్థాపన మరింత సమీపించింది’ అని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలని తాజాగా నిర్ణయించడం.. ప్రతిగా రష్యా సైతం 500 మంది అమెరికన్లను తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించిన వేళ జెలెన్స్కీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
నడుం నొప్పి.. కుంగుబాటు.. తలనొప్పి
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు