Zelenskyy: రష్యాపై మరిన్ని ఆంక్షల నిర్ణయం వేళ.. జపాన్లో అడుగుపెట్టిన జెలెన్స్కీ!
జీ7 సదస్సులో పాల్గొనేందుకుగానూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జపాన్కు చేరుకున్నారు. రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలని తాజాగా నిర్ణయించడం.. ప్రతిగా రష్యా సైతం 500 మంది అమెరికన్లను తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించిన వేళ జెలెన్స్కీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
టోక్యో: ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా సైనిక చర్య 15 నెలలకుపైగా కొనసాగుతోన్న వేళ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) నేడు జపాన్ (Japan) చేరుకున్నారు. అగ్రరాజ్యాల జీ7 సదస్సు (G7 Summit)లో పాల్గోనేందుకుగానూ ఆయన ఇక్కడి హిరోషిమా (Hiroshima)లో అడుగుపెట్టారు. రష్యా దాడులు మొదలైన అనంతరం జెలెన్స్కీ పర్యటిస్తోన్న మొదటి ఆసియా దేశం ఇది. ఇందులో భాగంగా ఆయన జీ7 దేశాల ప్రతినిధులతోపాటు ఇతర ఆహ్వానిత దేశాల నేతలతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్- రష్యా వివాదంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జీ7 సదస్సులో భాగంగా సభ్యదేశాలు ఉక్రెయిన్పై ప్రత్యేక ప్రకటన విడుదల చేశాయి. ‘ఉక్రెయిన్పై రష్యా చేపడుతోన్న చట్టవిరుద్ధ, అన్యాయమైన యుద్ధానికి వ్యతిరేకంగా కలిసి నిలబడాలనే జీ7 దేశాల నిబద్ధతను పునరుద్ఘాటించాం. ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘిస్తోన్న రష్యా వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రయత్నాలన్నింటినీ సమీకరించి.. ఉక్రెయిన్తో కలిసి పని చేస్తామని ‘శాంతికి చిహ్నం’ అయిన హిరోషిమా వేదికగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఉక్రెయిన్లో శాంతిస్థాపన దిశగా సహకరిస్తాం’ అని అందులో పేర్కొన్నాయి.
జపాన్ పర్యటనలో భాగంగా జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తదితర నేతలతో విడిగా భేటీ కానున్నట్లు సమాచారం. అంతకుముందు హిరోషిమాకు చేరుకున్న సందర్భంగా ‘జీ7 సదస్సులో భాగంగా ఉక్రెయిన్ మిత్ర దేశాలు, భాగస్వాములతో ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొననున్నా. రష్యాపై విజయం కోసం మరింత భద్రత సహకార చర్యలను ఆకాంక్షిస్తున్నా. నేడు శాంతిస్థాపన మరింత సమీపించింది’ అని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. రష్యాపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాలని తాజాగా నిర్ణయించడం.. ప్రతిగా రష్యా సైతం 500 మంది అమెరికన్లను తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధించిన వేళ జెలెన్స్కీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు