- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
china: బీజింగ్, షాంఘైల్లో జీరో కొవిడ్ లక్ష్యం సాధించిన చైనా
ఇంటర్నెట్డెస్క్: చైనాలోని అతిపెద్ద నగరాలైన బీజింగ్, షాంఘైల్లో ఎట్టకేలకు సోమవారం ఎలాంటి కొవిడ్ కేసులు నమోదు కాలేదు. జీరో కోవిడ్ లక్ష్యంగా అక్కడి అధికారులు.. ఫిబ్రవరి 19 నుంచి నాలుగు నెలల పాటు కఠిన ఆంక్షలు, లాక్డౌన్లు అమలు చేశారు. ఇక చైనాలో దేశ వ్యాప్తంగా కూడా కొవిడ్ కేసులు తగ్గి కేవలం 22 మాత్రమే నమోదైనట్లు అక్కడి జాతీయ హెల్త్ కమిషన్ వెల్లడించింది.
చైనా ఈ ఘనత సాధించేందుకు భారీ మూల్యమే చెల్లించింది. చివరిసారిగా షాంఘైలో ఫిబ్రవరి 23న ఎలాంటి సామాజిక వ్యాప్తి కనిపించలేదు. కానీ, ఆ తర్వాత నుంచి రెండు నెలల పాటు 25 మిలియన్ల మందిని కఠిన లాక్డౌన్లో ఉంచారు. దీంతోపాటు నిర్దేశించిన ఆంక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, రోజువారీ పరీక్షలను తీవ్రం చేశారు.
ఇక బీజింగ్లో చివరిసారి ఏప్రిల్ 16వ తేదీన జీరో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య పెరగడంతో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తాజాగా కొవిడ్ తీవ్రత తగ్గడంతో సోమవారం నుంచి విద్యార్థులు పాఠశాలలకు వెళుతున్నారు. ఇక్కడి వారు ఎక్కడికి వెళ్లినా.. సెల్ఫోన్లోని సంబంధిత యాప్లో గ్రీన్ కోడ్ను చూపాలి. అంతేకాదు.. ఏదైనా బహిరంగ ప్రదేశాలకు వెళితే ప్రతి మూడు రోజులకోసారి కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. మూడేళ్లు దాటిన పిల్లలు పార్కులో ఆడుకోవాలన్నా.. కొవిడ్ పరీక్షలు తప్పనిసరి. మరోవైపు చైనా టెక్ నగరమైన షెన్జెన్లో మాత్రం ఇంకా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
kashmir: రెండ్రోజుల్లో మూడు ఉగ్రదాడులు..!
-
Movies News
Koffee With Karan: కియారాని పెళ్లి చేసుకుంటావా.. సిద్ధార్థ్ మల్హోత్ర ఏమన్నారంటే?
-
Technology News
Apple: యాపిల్లోనూ యాడ్స్.. ఆ కంపెనీల బాటలోనే!
-
Politics News
Bihar Cabinet Expansion: నీతీశ్ వద్దే హోం.. మంత్రివర్గంలోకి తేజ్ ప్రతాప్
-
General News
Hyderabad Police: ‘సామూహిక జనగణమన’.. ఆన్లైన్ కనెక్టివిటీతో సక్సెస్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- Chinese Spy Ship: భారత్ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్టొట చేరిన నిఘా నౌక..!
- Ravindra Jadeja: చెన్నైతో ఇన్నింగ్స్ ముగిసినట్లే!
- Ashwini Dutt: చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన