Zimbabwe: ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశం!
ప్రపంచంలో అత్యంత దయనీయ (Most Miserable) పరిస్థితిలో జింబాబ్వే ఉన్నట్లు స్టీవ్ హాంకే ‘వార్షిక దయనీయ సూచిక (HAMI)’ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే (Zimbabwe) నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త స్టీవ్ హాంకే ‘వార్షిక దయనీయ సూచిక (HAMI)’ ప్రకారం.. అక్కడి ఆర్థిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్, సిరియా, సూడాన్ దేశాల కంటే ఇక్కడి పరిస్థితులు దయనీయంగా (Most Miserable) ఉండటం గమనార్హం. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన 157 దేశాల్లో.. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణంతో జింబాబ్వే తొలిస్థానంలో నిలిచింది.
‘అత్యంత తీవ్రమైన ద్రవ్యోల్బణం, అతి నిరుద్యోగిత, అత్యధిక వడ్డీ రేట్లు, బలహీనమైన జీడీపీ వృద్ధి.. ఇలా అన్నీ కలిపి జింబాబ్వేని ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశాల జాబితాలో (Hanke 2022 Annual Misery Index) తొలిస్థానంలో నిలిపాయి, ఇంతకంటే ఇంకా చెప్పాల్సిన అవసరముందా?’ అని ఆర్థికవేత్త స్టీవ్ హాంకే వెల్లడించారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో అప్లైడ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న స్టీవ్.. అధికారంలో ఉన్న జెడ్ఏఎన్యూ-పీఎఫ్ పార్టీతోపాటు ఆ ప్రభుత్వ విధానాలే జింబాబ్వేలో ఈ దుస్థితికి కారణమన్నారు. ఈ జాబితాలో వెనిజువెలా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, తుర్కియే, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘానా దేశాలు తొలి 15 దయనీయ దేశాల వరుసలో ఉన్నాయి.
మరోవైపు హెచ్ఏఎంఐ స్కోరును అతితక్కువ పొందిన దేశంగా స్విట్జెర్లాండ్ నిలిచింది. అంటే.. ఆ దేశ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అర్థం. రెండో స్థానంలో కువైట్ ఉండగా, ఐర్లాండ్, జపాన్, మలేసియా, తైవాన్, నైజర్, థాయిలాండ్, టోగో, మల్టా దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ మాత్రం 103 స్థానంలో ఉంది. మనదేశం దయనీయ స్థితిలో ఉండటానికి నిరుద్యోగం కారణమని తాజా నివేదిక పేర్కొంది. అమెరికా కూడా 134 స్థానంలో ఉందని.. ఇందుకు అక్కడి నిరుద్యోగమే ప్రధాన కారణమని తెలిపింది. ఇక వరల్డ్ హ్యాపియెస్ట్ రిపోర్టులో గత ఆరేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఫిన్లాండ్ మాత్రం ఈ జాబితాలో 109వ స్థానంలో ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా
అక్టోబరు 7నాటి హమాస్ దాడుల విషయంలో నిఘా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహరోన్ హలీవా రాజీనామా చేశారు. -
చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్తో దౌత్యం జరిపేనా!
చైనా అనుకూలుడిగా పేరున్న మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించింది. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) భారీ విజయాన్ని నమోదు చేసింది. -
దాడి భారీగానే చేశాం కానీ.. ఇజ్రాయెల్కు జరిగింది స్వల్ప నష్టమే
ఇజ్రాయెల్పై ఇరాన్ భారీస్థాయిలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్కు మాత్రం స్వల్ప నష్టమే జరిగింది. ప్రయోగించిన 300కి పైగా డ్రోన్లు, బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు పెద్దగా ప్రభావం చూపలేదు. -
కడుపుకోతల యుద్ధం
యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. -
అమెరికాలో కాల్పులు.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు
అమెరికాలోని మెంఫిస్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక పార్కులో జరుగుతున్న ఓ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో ఇద్దరు మరణించారు. -
మాకు పురుగుల బియ్యం పంపుతున్నారు
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో న్యాణత లోపించిందని రష్యా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. -
అసాధారణ వాతావరణ పోకడలు ఇక సర్వసాధారణం!
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో తీవ్రస్థాయి వేడి వాతావరణం నెలకొంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. వేడెక్కుతున్న భూగోళానికి ఇది నిదర్శనమని తెలిపింది. -
సముద్రంలో కుప్పకూలిన రెండు హెలికాప్టర్లు
జపాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రివేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన రెండు నౌకాదళ హెలికాప్టర్లు సముద్రంలో కుప్పకూలిపోయాయి. -
యుద్ధం ‘తల్లి’ ప్రాణం తీస్తే.. వైద్యులు ‘గర్భస్థ శిశువు’కు ఊపిరిపోశారు!
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 మంది చిన్నారులను ప్రాణాలు కోల్పోయారు. -
పురుగుల బియ్యం.. పాకిస్థాన్కు రష్యా వార్నింగ్!
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో పురుగులు రావడంపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో దిగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు
-
టీవీ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా