Measles: జింబాబ్వేలో మీజిల్స్ విలయం.. 700 మంది చిన్నారులు మృతి
ఆఫ్రికాలోని జింబాబ్వేలో మీజిల్స్ (Measles) విలయం సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారినపడి ఇటీవల 698 మంది చిన్నారులు మృత్యువాతపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
హరారే: ఆఫ్రికాలోని జింబాబ్వేలో మీజిల్స్ (Measles) విలయం సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారినపడి ఇటీవల 698 మంది చిన్నారులు మృత్యువాతపడినట్లు జింబాబ్వే ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా టీకాను తప్పనిసరి చేయాలని.. ఇందుకు సంబంధించి చట్టాన్ని సవరించాలనే డిమాండ్ మొదలయ్యింది. మరోవైపు భారీ స్థాయిలో నమోదవుతోన్న మీజిల్స్ (Measles) కేసులు, మరణాలపై అటు ఐరాస విభాగం యూనిసెఫ్ (UNICEF) కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
జింబాబ్వేలోని (Zimbabwe) మనికాల్యాండ్ ప్రావిన్సులో ఏప్రిల్ తొలివారంలో మీజిల్స్ వ్యాధిని గుర్తించారు. అనంతరం కొన్ని వారాల్లోనే దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పటివరకు 6291 కేసులు నమోదుకాగా.. 698 మంది చిన్నారులు మృత్యువాతపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం సెప్టెంబర్ 1వ తేదీన ఒక్కరోజే 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. రెండు వారాల క్రితం కేవలం 157 మరణాలే ఉండగా.. తాజాగా ఆ సంఖ్య నాలుగు రెట్లు పెరగడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది.
వ్యాక్సిన్ తీసుకోకపోవడమే కారణం..
మత విశ్వాసాల కారణంగా అక్కడ (Zimbabwe) చాలా కుటుంబాలు వ్యాక్సిన్కు దూరంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల మరణించిన వారిలో వ్యాక్సిన్ తీసుకోని వారే అధికంగా ఉన్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి మోనైకా ముత్స్వాంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ను తప్పనిసరి చేయాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీకాను తిరస్కరించే వర్గాలే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు పెంచాలని అక్కడి మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జోహన్నస్ మారిసా పేర్కొన్నారు. ఆరు నెలల నుంచి 15ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు మీజిల్స్ టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు.
ప్రపంచంలో అధికంగా సంభవించే అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకటి. దగ్గు, తుమ్మడం లేదా సన్నిహితంగా మెలగడం వల్ల ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకోని పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువై మరణం కూడా సంభవిస్తుంది. ముఖ్యంగా పోషకాహారలోపంతో బాధపడే చిన్నారుల్లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?