IND vs AUS: నాలుగో టీ20 భారత్దే.. అక్షర్కు POTM
ఆసీస్తో నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ 20 పరుగుల తేడాతో (IND vs AUS) విజయం సాధించింది. టీమ్ఇండియా 174/9 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 154/7 స్కోరుకే ఆసీస్ పరిమితమైంది. అక్షర్ పటేల్ 3, దీపక్ చాహర్ 2.. రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ తీశారు. వేడ్ (36*), హెడ్ (31), షార్ట్ (22), బెన్ డార్మెట్ (19) ఫర్వాలేదనిపించారు. అక్షర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ (POTM) అవార్డు వరించింది. ఐదు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్ బెంగళూరు వేదికగా ఆదివారం జరగనుంది.