Jharkhand: ఆలయంలో దీపం.. ఆమె పాలిట శాపం..!

ఆలయంలో దీపం వెలిగిస్తూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఓ భక్తురాలు మృతి చెందిన ఘటన ఝూర్ఖండ్ పాలములో జరిగింది. మేదినీనగర్ కుండ్ మొహల్లాలో ఉన్న శివాలయానికి ఓ మహిళ పూజలు చేయడానికి వెళ్లారు. దీపం వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో ఆమె శరీరం బాగా కాలిపోగా చికిత్స పొందుతూ చనిపోయారు

Published : 27 Apr 2022 10:47 IST

Tags :

మరిన్ని