Karimnagar: మండు వేసవిలో ఎగిసిపడుతున్న గోదావరి జల సవ్వడులు..

గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ లోని రెండు బాహుబలి పంపులతో నీటిని తరలిస్తున్నారు. 7వేల క్యూసెక్కుల నీరు మధ్య మానేరు ప్రాజెక్టుకులోకి చేరుతోంది. ప్రస్తుతం 6, 7 బాహుబలి పంపులతో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మండు వేసవిలో ఎగిసిపడుతున్న గోదావరి జల సవ్వడులు కనువిందు చేస్తున్నాయి.

Published : 02 May 2022 17:05 IST

Tags :

మరిన్ని