Andhra news: బస్సుకు అద్దంలేదు...జోరు వాన.. వెనక్కి తగ్గని డ్రైవర్!
ఓవైపు వర్షం కురుస్తోంది.. బస్సుకు ముందు వైపు అద్దం లేదు.. అయినా డ్రైవర్ వెనకడుగు వేయలేదు. కాకినాడ డిపోకు చెందిన బస్సు విజయవాడ నుంచి కాకినాడ ప్రయాణీకులతో బయలుదేరింది. ఏం జరిగిందో ఏమో రాజమండ్రి వచ్చేసరికి బస్సు ముందు అద్దం లేదు. కిటికీలకు ఉన్న అద్దాలు కొన్ని ఊడిపోయి కనిపిస్తున్నాయి. జోరున వర్షం కురుస్తుండటంతో డ్రైవర్, ప్రయాణీకులు తడిసి ముద్దయ్యారు.
Published : 09 May 2022 19:58 IST
Tags :