Srilanka: శ్రీలంక వ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ

ఆర్థిక, రాజకీయ సంక్షోభం గుప్పిట చిక్కుకున్న శ్రీలంకలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. శ్రీలంకలో అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారుల దాడిలో ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పంటించారు. ఆందోళనకారులపై అధికార పార్టీ అనుకూల వర్గాలు చేసిన దాడిలో 130 మంది గాయపడ్డారు.

Published : 09 May 2022 22:00 IST
Tags :

మరిన్ని