Viral Video: కోడలికి పెళ్లి చేసిన అత్తామామ..

కరోనాతో భర్తను పోగొట్టుకున్న మహిళకు అత్తామామలే దగ్గరుండి మరో వివాహం జరిపించిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ధార్ జిల్లాకు చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి యుగ్ ప్రకాశ్ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రియాంక్ తివారికి భార్య ప్రియాంక, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్ మృతితో ప్రియాంక జీవితం ఆగిపోవద్దని ఆమె అత్త, మామ మరో వ్యక్తితో అక్షయ తృతీయ రోజున వివాహం జరిపించారు.

Published : 14 May 2022 12:19 IST

Tags :

మరిన్ని