KA Paul : కేసీఆర్‌ నిజస్వరూపం బయటపడింది..: కేఏ పాల్‌

కుంభకోణాలు, కబ్జాలకు పాల్పడిన వారిని రాజ్యసభకు పంపించడం ఏంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ప్రశ్నించారు. తెలంగాణలోని 1200 మంది అమరవీరుల కుటుంబాల్లో రాజ్యసభకు పంపించేందుకు సీఎం కేసీఆర్‌కు ఒక్కరు కూడా అర్హులు కనిపించలేదా అని నిలదీశారు. ‘‘ఒకరు మైనింగ్‌ డాన్‌.. మరొకరు రూ.500 కోట్ల స్కామ్‌లో పట్టుబడ్డ వ్యక్తి.. ఇంకొక్కరు భూకబ్జాలు చేసిన వ్యక్తి.. వీరికి ఏ అర్హత ఉందని రాజ్యసభకు పంపుతున్నారు’’ అని మండిపడ్డారు.

Published : 19 May 2022 19:10 IST

Tags :

మరిన్ని