CPI Narayana: ఐఎస్బీ విద్యార్థులపై నిఘా అప్రజాస్వామిక చర్య : సీపీఐ నారాయణ
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) విద్యార్థులపై నిఘా అప్రజాస్వామిక చర్యగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ‘ప్రతిష్ఠాత్మక ఐఎస్బీ హైదరాబాద్లో వార్షికోత్సవం జరగబోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా వస్తున్నారు. ఈ విద్యాలయంలో చదివిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారే. అలాంటి వారిపై నిఘా దుర్మార్గమైన చర్య’ అని ఆయన విమర్శించారు.
Published : 24 May 2022 10:48 IST
Tags :