Viral Video: గంగానది వంతెనపై వెళ్తున్న రైలు.. మొబైల్‌ ఎలా కొట్టేశాడో చూడండి..

గంగానది వంతెన దాటుతున్న సమయంలో రైలు మెట్లపై కూర్చుని వీడియో తీస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి ఓ దొంగ రెప్పపాటులో ఫోన్ లాక్కొని వెళ్లిన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. కతిహార్ నుంచి పట్నా వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు వ్యక్తులు మెట్లపై కూర్చుని గంగా నది ఫొటోలు తీస్తున్నారు. ఆ సమయంలో రైలు బెగుసరాయ్ సమీపంలోని వంతెన దాటుతోంది. ఈ క్రమంలోనే వంతెనపై ఉన్న ఓ దొంగ ఒక్కసారిగా వారి నుంచి ఫొన్ లాక్కొన్నాడు.

Published : 09 Jun 2022 19:05 IST

Tags :

మరిన్ని