Hyd News: రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం..

తెలంగాణ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘రాజ్‌భవన్‌ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలపై ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ద్విచక్రవాహనాన్ని ఆందోళన కారులు తగులబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సుపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Published : 16 Jun 2022 14:22 IST

Hyd News: రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం..

తెలంగాణ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘రాజ్‌భవన్‌ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలపై ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ద్విచక్రవాహనాన్ని ఆందోళన కారులు తగులబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. బస్సుపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags :

మరిన్ని