Agnipath: అగ్నిపథ్‌తో యువతకు చక్కని భవిష్యత్‌: అమిత్‌ షా

హైదరాబాద్: అగ్నిపథ్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న వేళ ఈ కార్యక్రమాన్ని కేంద్రం సమర్థించింది. అగ్నిపథ్  పథకం వల్ల యువతకు సైనిక దళాల్లో సేవ చేసే అవకాశం రావడం సహా వారికి చక్కని భవిష్యత్తు లభిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తొలి ఏడాది గరిష్ఠ వయసును 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచామన్నారు. యువత సమస్యను అర్థం చేసుకుని రెండేళ్ల వయసు సడలింపుపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని అమిత్‌ షా చెప్పారు.

Published : 17 Jun 2022 16:27 IST
Tags :

మరిన్ని