Andhra news: పెట్రోల్‌ బంకులో యువకులపై ఎస్సై వీరంగం.. వీడియో వైరల్‌

పెట్రోల్ కోసం బంక్ వద్దకు వచ్చిన ఇద్దరు యువకులను బాపట్ల జిల్లా చెరుకుపల్లి ఎస్సై కొండారెడ్డి దాడికి పాల్పడిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 23న రాత్రి అభివుల్ల (18), మిత్రుడు రాకేష్(21)తో కలిసి సెంటర్‌కి వచ్చాడు. అక్కడ ఇద్దరినీ చూసిన ఎస్సై.. ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ఉదయం స్టేషన్‌కు వచ్చి కలవమని చెప్పి వారి ఫోన్‌లను ఎస్సై తీసుకున్నారు. ఇంటికి వెళ్తూ బండిలో పెట్రోల్ కొట్టించుకునేందుకు బంక్ వద్ద ఆగిన యువకులను అప్పటికే అక్కడ ఉన్న ఎస్సై చూసి.. ఇంకా ఇంటికి వెళ్ళలేదా అంటూ ఒక్కసారిగా ఇద్దరిపై దాడి చేశాడు. దుర్భాషలాడుతూ కొట్టిన దృశ్యాలు పెట్రోల్ బంక్‌లోని సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి.

Published : 25 Jun 2022 13:54 IST

Andhra news: పెట్రోల్‌ బంకులో యువకులపై ఎస్సై వీరంగం.. వీడియో వైరల్‌

Tags :

మరిన్ని