Viral video: బైక్‌పై వచ్చి.. పట్టపగలే చోరీ!

గుజరాత్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సూరత్‌లోని ఉధనా ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి రూ.28 లక్షలు ఉన్న బ్యాగును కొట్టేశారు. ద్విచక్రవాహనంపైన వచ్చిన ముగ్గురు నిందితులు.. జగదీశ్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. ప్రతిఘటించేందుకు యత్నించిన జగదీశ్.. బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. ఈ కేసును సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published : 30 Jun 2022 15:27 IST
Tags :

మరిన్ని