Ap News: కౌలు రైతు ఆత్మహత్య.. పరిహారం కోసం 12 ఏళ్లుగా పడిగాపులు

ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంటను అకాల వర్షం నిండా ముంచింది. అప్పుతీర్చే మార్గం లేక ఓ రైతు గుండె బరువెక్కి పొలంలోనే పురుగులమందు తాగి తనువు చాలించాడు. కుటుంబానికి పెద్ద దిక్కు లోకాన్ని వదిలివెళ్లడంతో భార్యా, కుమారుడు రోడ్డున పడ్డారు. పోనీ ప్రభుత్వం ఇచ్చే పరిహారమైనా ఆసరాగా ఉంటుందనుకుంటే ఆ ఊసే లేదు. పరిహారం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రోజులు కాదు.. నెలలు కాదు.. ఏకంగా పన్నెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇది ఓ కౌలు రైతు కన్నీటి గాథ.

Published : 18 Mar 2023 16:04 IST
Tags :

మరిన్ని