Ukraine Crisis: బఖ్ముత్లో 20 వేల మందిని కోల్పోయిన రష్యా
ఉక్రెయిన్ (Ukraine)లోని బఖ్ముత్ నగరంలో జరిగిన సుదీర్ఘ పోరులో తమ గ్రూపు 20 వేల మందిని కోల్పోయిందని రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ వెల్లడించారు. యుద్ధం కోసం 50వేల మందిని నియమించుకోగా.. 20 శాతం మంది మరణించినట్లు చెప్పారు. రష్యాకు అనుకూలమైన ఓ రాజకీయ వ్యూహకర్తకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిగోజిన్ ఈ విషయాలు తెలిపారు. ప్రిగోజిన్ ప్రకటనతో రష్యా భారీగానే నష్టపోయినట్లు తెలుస్తోంది.
Published : 25 May 2023 14:55 IST
Tags :