Madhya Pradesh: పసివాడి ప్రాణాన్ని మింగేసిన బోరుబావి

దేశంలో మరో బోరు బావి.. అభం శుభం తెలియని చిన్నారి పాలిట మృత్యుపాశమైంది. పొలంలో అప్పటివరకూ లేడి పిల్లలా గంతులేసిన ఆ చిన్నారి.. ఉన్నట్లుండి బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని బయటకు తీసేందుకు.. 70 గంటల పాటు నిర్విరామంగా జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. తన కుమారుడు ప్రాణాలతో బయటకు వస్తాడని కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూసిన ఆ తల్లి ఆశలు ఫలించలేదు. మధ్యప్రదేశ్‌లో.. బోరు బావిలో పడిపోయిన ఎనిమిదేళ్ల తన్మయ్ కన్నుమూశాడు.

Published : 10 Dec 2022 15:33 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు