తిరుపతి జిల్లాలో అమానవీయం.. బైక్‌పై కుమారుడి మృతదేహాన్ని మోసుకెళ్లిన తండ్రి

తిరుపతి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కేవీబీపురం మండలం దిగువ పుత్తూరులో బసవయ్య అనే ఏడేళ్ల బాలుడు ఇంట్లో ఉన్న సమయంలో పాము కాటేసింది. బాలుడిని కేవీబీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలుడు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్సు వాహన యజమానులు నిరాకరించడంతో.. తండ్రి చంచయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. దీంతో చేసేదేమీలేక కుమారుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపైనే తన స్వగ్రామానికి తీసుకెళ్లారు.

Published : 11 Oct 2022 17:19 IST

తిరుపతి జిల్లాలో అమానవీయం.. బైక్‌పై కుమారుడి మృతదేహాన్ని మోసుకెళ్లిన తండ్రి

తిరుపతి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కేవీబీపురం మండలం దిగువ పుత్తూరులో బసవయ్య అనే ఏడేళ్ల బాలుడు ఇంట్లో ఉన్న సమయంలో పాము కాటేసింది. బాలుడిని కేవీబీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలుడు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్సు వాహన యజమానులు నిరాకరించడంతో.. తండ్రి చంచయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. దీంతో చేసేదేమీలేక కుమారుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపైనే తన స్వగ్రామానికి తీసుకెళ్లారు.

Tags :

మరిన్ని