Kamareddy: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయి.. గుహలో వ్యక్తి నరకయాతన

వేటకు వెళ్లిన వ్యక్తి అనుకోకుండా గుహలో ఇరుక్కుపోయి 24 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా రెడ్డిపేటకు చెందిన షాడ రాజు (38).. మంగళవారం సాయంత్రం ఘన్‌పూర్‌ శివారులో వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన సెల్‌ఫోన్‌ కింద పడిపోవడంతో.. దానిని తీసేందుకు యత్నించి గుహలో ఇరుక్కుపోయాడు. అతనితో వచ్చిన స్నేహితుడు, కొందరు గ్రామస్థులు.. అతనిని బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. జేసీబీ సాయంతో రాళ్లను తొలగించి రాజును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. 

Published : 14 Dec 2022 21:47 IST

వేటకు వెళ్లిన వ్యక్తి అనుకోకుండా గుహలో ఇరుక్కుపోయి 24 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా రెడ్డిపేటకు చెందిన షాడ రాజు (38).. మంగళవారం సాయంత్రం ఘన్‌పూర్‌ శివారులో వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన సెల్‌ఫోన్‌ కింద పడిపోవడంతో.. దానిని తీసేందుకు యత్నించి గుహలో ఇరుక్కుపోయాడు. అతనితో వచ్చిన స్నేహితుడు, కొందరు గ్రామస్థులు.. అతనిని బయటకు లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. జేసీబీ సాయంతో రాళ్లను తొలగించి రాజును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. 

Tags :

మరిన్ని