AP News: ఏపీ డిప్యూటీ స్పీకర్‌పై హెలికాప్టర్‌తో పూల వర్షం.. 400 కార్లు, 2 వేల బైక్‌లతో ర్యాలీ

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తొలిసారి విజయనగరంలో అడుగుపెట్టిన కోలగట్ల వీరభద్రస్వామికి వైకాపా శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏకంగా 400 కార్లు, 2 వేల ద్విచక్ర వాహనాలతో ర్యాలీ తీయడమే కాకుండా.. హెలికాప్టర్‌ ద్వారా పూల జల్లు కురిపించారు. సుమారు 4 గంటల పాటు ఈ ర్యాలీ అత్యంత కోలాహలంగా సాగగా.. విశాఖ-విజయనగరం-ఒడిశా మార్గంలో రద్దీ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Published : 25 Sep 2022 18:32 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు