Road Accident: రెండు వాహనాలను ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరి దుర్మరణం
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ కంటైనర్తో మరో రెండు వాహనాలు ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇందౌర్ వెళ్తున్న కంటైనర్పై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్.. డివైడర్ దాటి ఎదురుగా ఉన్న మరో 2 వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 3 వాహనాల్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు.
Published : 11 Mar 2023 17:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ