Road Accident: రెండు వాహనాలను ఢీకొట్టిన కంటైనర్‌.. ఇద్దరి దుర్మరణం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ కంటైనర్‌తో మరో రెండు వాహనాలు ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇందౌర్ వెళ్తున్న కంటైనర్‌పై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్.. డివైడర్ దాటి ఎదురుగా ఉన్న మరో 2 వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో 3 వాహనాల్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. 

Published : 11 Mar 2023 17:37 IST

Tags :

మరిన్ని